అడుగేస్తే.. ఆక్రమణే
పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ స్థలాలపై కొందరు అక్రమార్కులు కన్నేసి పాగా వేస్తున్నారు. పెద్దల సహకారంతో దర్జాగా కబ్జా చేస్త్తున్నారు.
న్యూస్టుడే, పిఠాపురం, సామర్లకోట
పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ స్థలాలపై కొందరు అక్రమార్కులు కన్నేసి పాగా వేస్తున్నారు. పెద్దల సహకారంతో దర్జాగా కబ్జా చేస్త్తున్నారు. కళ్లెదుట ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటున్నా.. పురపాలక ఆదాయానికి గండిపడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదు. సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం పురపాలికల్లో భూకబ్జాలపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
సామర్లకోట: నీలమ్మ చెరువు గట్టుపై భవనాలు
ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు అనువైన స్థలాలను పురపాలక అధికారులు గుర్తించి సంబంధిత శాఖకు బదలాయిస్తారు. అలాంటి స్థలాలు, చెరువు గట్లను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. అందులో శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. వీటికి అనుమతి లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అదే గూడు లేని పేదలు ప్రభుత్వ స్థలంలో చిన్న పాక వేసుకుంటే అధికారులు వెంటనే పీకిపారేస్తారు. పట్టణాల్లో పెరుగుతున్న భూ ఆక్రమణలు, అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
* సామర్లకోట పట్టణంలో పురపాలక సంఘ ఖాళీ స్థలాలు, బహిరంగ మరుగుదొడ్లు స్థలాన్ని, చెరువు గట్లను ఆక్రమించి భవనాలు నిర్మించారు. ఈ పట్టణ నడిబొడ్డున ఉన్న నీలమ్మ చెరువు నీటిని పూర్వం తాగునీటికి వినియోగించేవారు. ఈ చెరువు గట్టుపై నడక దారి, పచ్చదనంతో ఉద్యానంగా అభివృద్ధికి రూ.లక్షల్లో నిధులు వెచ్చించినా, ఆ దిశగా ప్రగతికి నోచుకోలేదు. అక్రమార్కుల చర్యలతో రోజరోజుకు చెరువు గర్భం మూసుకుపోతోంది. గట్టు ఆక్రమణకు గురవుతోంది. ఇక్కడ గట్టు చుట్టూ లయన్స్క్లబ్, వివేకానంద, సొసైటీ, పాఠశాల భవనాలు నిర్మించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు భవనం, కల్యాణ మండపం నిర్మించారు.
* పెద్దాపురం పాత బస్టాండు సమీపంలోని చెరువు ఆక్రమణకు గురైంది. దీని పక్కన ఉంటున్న వ్యక్తి తన స్థలంతో పాటు చెరువును ఆనుకుని ఉన్న సుమారు వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పట్టణంలో ఆర్అండ్బీ రహదారి పక్కన చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి.
పిఠాపురం: జగ్గయ్యచెరువులో రోడ్డుపక్క ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారాలు
* పిఠాపురం పట్టణంలో రోడ్ల పక్కన ప్రభుత్వ స్థలాలు ఆక్రమార్కుల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. రెండేళ్ల క్రితం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్రమణలు పూర్తి స్థాయిలో తొలగించారు. మార్కెట్ సెంటర్ నుంచి జగ్గయ్య చెరువు వరకూ దుకాణాలు, ఇళ్లు కూల్చేశారు. మళ్లీ ఏడాదిలో ఆక్రమణలు పెరిగిపోయాయి. జగ్గయ్యచెరువులోని బీఎంఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాల పక్కన గతంలో దుకాణాలు తొలగించగా.. ప్రజాప్రతినిధుల అండతో కిరాణా, కూరగాయలు, అల్పాహార దుకాణాలు వెలిశాయి. రథాలపేట సెంటర్, ఆర్టీసీˆ కాంప్లెక్స్ ఏరియా ప్రాంతాల్లోనూ దుకాణాలు ఏర్పాటు చేసి, అద్దెకు ఇచ్చేశారు. జాతీయ రహదారి వెంబడి ప్రభుత్వ స్థలాల్లోనూ దుకాణాలు వెలిశాయి.
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగిస్తాం..
ఎన్వీవీ సత్యనారాయణరావు, పురపాలక ప్రాంతీయ సంచాలకుడు, రాజమహేంద్రవరం
పురపాలక స్థలాలు ఆక్రమించడం, భవనాలు నిర్మించడం నేరం. పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నాం. కొందరు దౌర్జన్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. సర్వే చేసి చర్యలు తీసుకుంటాం. సేవా ముసుగులో అద్దెలు వసూలు చేసే సంస్థలపై విచారణ చేపడతాం. పురపాలక ఆస్తులు పరిరక్షిస్తాం. ఆదాయానికి గండిపడితే సహించం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత