విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి కృషి చేయాలని కలెక్టర్ కె.మాధవీలత సూచించారు.
ఉపకార వేతనాలు పొందిన విద్యార్థినులతో కలెక్టర్ తదితరులు
రాజమహేంద్రవరం సాంస్కృతికం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి కృషి చేయాలని కలెక్టర్ కె.మాధవీలత సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీలో భాగంగా మలబార్ గోల్డ్ సంస్థ జిల్లాలోని 24 ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థినులు 406 మందికి సోమవారం ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆనం కళాకేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ 406 మందికి రూ.37.52 లక్షల స్కాలర్ షిప్స్ అందజేశారు. మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనకు నూరుశాతం కృషి చేయాలన్నారు. మలబార్ గోల్డ్ రాజమహేంద్రవరం హెడ్ కె.ఫెబిన్, మేనేజర్ కె.వెంకట లక్ష్మీపతి, ప్రవీణ్ కుమార్, లయన్స్ జిల్లా గవర్నర్ మంగతాయారు, ఇంటర్ బోర్డ్ ఆర్జేడీ శారద, జె.వి.వి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
YouTube: యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే నగదు.. వెలుగులోకి నయా సైబర్ మోసం!
-
Sports News
Virat Kohli: విరాట్ కొత్త టాటూ.. అర్థమేంటో చెప్పేసిన టాటూ ఆర్టిస్ట్
-
Movies News
Telugu Movies: ఈ ఏప్రిల్లో ప్రతివారం థియేటర్లో సందడే సందడి
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసులో ప్రముఖ సంస్థలకు నోటీసులు
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వర్కౌట్ గ్లో’.. ఊటీలో నోరా సందడి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు