ఆదేశం.. ఆచరిస్తేనే ప్రతిఫలం
అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, దేవస్థానంలో అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంపై అధికారులు దృష్టిసారించారు.
న్యూస్టుడే, అన్నవరం
ఆలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూం
అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, దేవస్థానంలో అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంపై అధికారులు దృష్టిసారించారు. భక్తులు నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వీటిపై పకడ్బందీ పర్యవేక్షణ అవసరముంది.
కమాండ్ కంట్రోల్ రూం
ఆలయ ప్రాంగణంలో అతిపెద్ద కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేవిధంగా నాణ్యమైన కెమెరాలు ఏర్పాటు చేసి దీనికోసం ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు. దత్తత దేవాలయాలు, పాఠశాలల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంప్రదాయ వస్త్రధారణపై..
సత్యదేవుని వ్రతం, నిత్యకల్యాణం, ఇతర పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొంటున్నారు. భక్తులకు అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. పురుషులు పంచె, కండువా లేదా కుర్తా, పైజమా, మహిళలు చీర లేదా కుర్తా, పైజమా ధరిస్తున్నారు. భక్తులు నిలువు తిలకం, నిలువు నామం, నుదుటిన బొట్టు పెట్టుకునే ఆలయంలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. గతంలోనూ వస్త్రధారణ అమలు చేసినా ఆ తర్వాత పరిస్థితి యథావిధికి వచ్చింది.
వసూళ్లు ఆగేనా..?
వ్రతమాచరించే భక్తుల నుంచి దానాల పేరుతో వసూలుకు కొంత బ్రేక్ పడింది. భక్తులు సంతోషంగా తోచింది ఇస్తే తీసుకోవాలని ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవని ఆదేశాలతో అంతా అప్రమత్తమయ్యారు. క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టారు. దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేశారు. వ్రత విభాగానికి సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. తీరు మారాలని అధికారులు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. తాజాగా దీనిపై దృష్టిపెట్టారు. పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని భక్తులు సూచిస్తున్నారు.
గోవులకు జల్లు స్నానం..
దేవస్థానం ఆధ్వర్యంలో కొండదిగువున కొత్తపేట ప్రాంతంలో గోశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ వందలాది ఆవులు ఉంటాయి. గోశాల నిర్వహణ, గోసంరక్షణ చర్యల్లో పలు మార్పులు చేశారు. గోవులకు జల్లు స్నానం ఏర్పాటు చేశారు. షెడ్డుల్లో పంకాలు అమర్చారు.
ప్రసాదం నాణ్యతపై..
ప్రసాదం నాణ్యతపై ఇటీవల పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రత్యేక కమిటీని నియమించి పలు సార్లు తయారీపై పర్యవేక్షించారు.
సౌకర్యాల కల్పనకే నిబంధనలు..
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిబంధనలు అమలు చేస్తున్నాం. దేవస్థానంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. అవసరానికి అనుగుణంగా మార్పులు తీసుకువస్తాం. ఇచ్చిన ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు చేసేలా పర్యవేక్షణ ఉంటుంది.
చంద్రశేఖర్ ఆజాద్, ఇన్ఛార్జి ఈవో, అన్నవరం దేవస్థానం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు
[ 23-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. -
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
[ 23-04-2024]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా