గంజాయి రవాణా గుట్టురట్టు
ఒకరు వ్యాన్ డ్రైవర్.. మరొకరు క్లీనర్.. ఇద్దరూ కలిసి వ్యాన్ కేబిన్లో ప్రత్యేక అరలు తయారు చేయించి గంజాయి తరలించే ప్రయత్నంలో హైదరాబాద్ నార్కొటిక్స్ వింగ్(హెచ్.న్యూ) ఇన్స్పెక్టర్ రాజేష్ బృందానికి చిక్కారు.
స్వాధీనం చేసుకున్న సరకు, నిందితులు
హైదరాబాద్, న్యూస్టుడే: ఒకరు వ్యాన్ డ్రైవర్.. మరొకరు క్లీనర్.. ఇద్దరూ కలిసి వ్యాన్ కేబిన్లో ప్రత్యేక అరలు తయారు చేయించి గంజాయి తరలించే ప్రయత్నంలో హైదరాబాద్ నార్కొటిక్స్ వింగ్(హెచ్.న్యూ) ఇన్స్పెక్టర్ రాజేష్ బృందానికి చిక్కారు. హెచ్న్యూ డీసీపీ గుమ్మి చక్రవర్తి ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. రాజమహేంద్రవరం మోరంపూడి ప్రాంత నివాసి సి.శ్రీనివాస్రావు(48) వ్యాన్ డ్రైవర్. వీఎల్ పురం నివాసి ఎ.సత్తిబాబు(29) క్లీనర్. సీలేరు ప్రాంతానికి చెందిన పాండు, నాగేష్లు శ్రీనివాస్రావుకు పరిచయమయ్యారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు గంజాయి చేరవేస్తే ట్రిప్నకు రూ.1.2 లక్షలు కిరాయి ఇస్తానంటూ ఆశ చూపారు. పెద్దమొత్తంలో డబ్బు చేతికి వస్తుందనే ఆశతో ఒప్పందం చేసుకున్నారు. వ్యాన్లో ప్రత్యేక అరలు తయారు చేయించారు. వీటిలో 200కిలోల గంజాయిని పొట్లాలుగా మార్చి భద్రపరిచారు. సరకుతో శనివారం రాజమహేంద్రవరం నుంచి బయల్దేరారు. దీనిపై ముందుగానే సమాచారం రావటంతో హెచ్న్యూ, లంగర్హౌస్ పోలీసులు అత్తాపూర్ వంతెన వద్ద తనిఖీచేస్తే గుట్టు బయటపడింది. సరకు స్వాధీనం చేసుకుని, శ్రీనివాసరావు, సత్తిబాబుతోపాటు గంజాయిని దిగుమతి చేసుకునేందుకు వచ్చిన రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ హబీబ్(35)ను అరెస్ట్ చేశారు. ఆసిఫ్నగర్ జిర్రా ప్రాంతానికి చెందిన పర్వేజ్ సరకును మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులు పర్వేజ్, చాంద్రాయణగుట్టకు చెందిన జావేద్, మహారాష్ట్ర ఉస్మానాబాద్ నివాసి మంగేష్, ఆంధ్రప్రదేశ్కు చెందిన నాగేష్, పాండులు పరారీలో ఉన్నారు.
170 కిలోలు స్వాధీనం
రాజమహేంద్రవరం నేరవార్తలు: ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 170 కేజీల గంజాయిని బొమ్మూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాయుడు విజయ్కుమార్ వివరాల మేరకు.. ఆదివారం మధ్యాహ్నం దివాన్చెరువు పండ్ల మార్కెట్ వెనుక ఓ వ్యానులో నుంచి మరో కారులోకి కొన్ని మూటలను మార్చుతున్నట్లుగా స్థానికులు సమాచారం అందించడంతో ఎస్సై జగన్మోహన్ తన బృందంతో వెళ్లి గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చీదిగుమ్మల రాజవరానికి చెందిన బర్ల రాజబాబు ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని అదే ప్రాంతానికి చెందిన బొట్ట శివకుమార్, కొప్పు రాంబాబు, కొప్పు సత్తిబాబు, ఎన్నేటి దుర్గాప్రసాద్లతో కలిసి వ్యానులో ఆదివారం రాజమహేంద్రవరం జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ నిరీక్షిస్తున్న చెన్నైకు చెందిన ఆర్.దినేష్కుమార్ ఆ గంజాయిని తన కారులోకి మార్చుకుని ఆ రాష్ట్రానికి తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయితో పాటు రూ.3.52 లక్షల నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, తొమ్మిది సెల్ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!