ప్యారీ షుగర్స్లో మళ్లీ ప్రమాదం.. డ్రైవర్ మృతి
కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సోమవారం లోడింగ్ యంత్రం టైర్లకు గాలి పడుతుండగా టైర్ పేలిపోయి డ్రైవర్ దుర్మరణం చెందాడు.
శివకుమార్
సర్పవరం జంక్షన్: కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సోమవారం లోడింగ్ యంత్రం టైర్లకు గాలి పడుతుండగా టైర్ పేలిపోయి డ్రైవర్ దుర్మరణం చెందాడు. తూరంగి ప్రాంతంలోని మహాలక్ష్మినగర్కు చెందిన పెనుపోతు శివకుమార్ (34) తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గత ఎనిమిది నెలల కాలంలో జరిగిన మూడు ప్రమాదాల్లో అయిదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన యంత్రాలు, వాహనాల కారణంగా తాజాగా ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పరిశ్రమ గేటు వద్ద మృతుని కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. బాధితుల తరఫున మత్స్యకార సంఘాల నాయకులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మత్య్సకార, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేయడంతో డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి వారిని సముదాయించి కంపెనీ ప్రతినిధులతో చర్చలకు అవకాశం కల్పించారు. కంపెనీ యాజమాన్యం రూ.40 లక్షలు, వర్కుమెన్ కాంపన్షేషన్గా రూ.10 లక్షలు, గుత్తేదారు నుంచి రూ.5 లక్షలు మొత్తంగా రూ.55 లక్షల పరిహారంతో పాటు మృతుని భార్యకు కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. శివకుమార్ కంపెనీలో దాదాపు అయిదు సంవత్సరాలుగా డ్రైవర్ విధులు నిర్వహిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే...
అధికారుల నిర్లక్ష్యం, కర్మాగారంలో భద్రతా ప్రమాణాలు పాటించపోవడంతోనే ప్యారీ షుగర్స్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త ప్రసాద్ ఆరోపించారు. కంపెనీ గేటు వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. కంపెనీలో రెండో ప్రమాదం జరిగిన తర్వాత భద్రతా ఆడిట్ చేయించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేసినా ఎవరూ స్పందించలేదన్నారు. యంత్ర పరికరాలతో పాటు యంత్రాల భద్రతను కూడా తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా యాజమాన్యాలు భద్రతా చర్యలు చేపట్టడం లేదని ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు రంబాల సతీష్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు
[ 23-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. -
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
[ 23-04-2024]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్