ఎక్కడికక్కడ అంగన్వాడీల నిర్బంధం
తమ హక్కుల సాధనకు సోమవారం విజయవాడలో మహాధర్నాకు వెళుతున్న అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు.
రావులపాలెం పోలీసుస్టేషన్లో కార్యకర్తలు, సహాయకులు
అమలాపురం కలెక్టరేట్: తమ హక్కుల సాధనకు సోమవారం విజయవాడలో మహాధర్నాకు వెళుతున్న అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. జిల్లానుంచి సుమారు 1,500 మంది సిబ్బంది విజయవాడ తరలివెళ్లాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచే వారిని స్థానిక సచివాలయ మహిళా పోలీసులతో గృహ నిర్బంధాలు చేశారు. కొంతమందిని విజయవాడ వెళుతున్న క్రమంలో మలికిపురం మండలం దిండి చెక్పోస్టు, రావులపాలెం జాతీయ రహదారి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసుస్టేషన్లకు తరలించి సోమవారం మధ్యాహ్నం నుంచి విడుదల చేశారు. విజయవాడ వెళుతున్నవారిలో రాజోలు బస్డాండులో 30 మందిని, దిండి చెక్పోస్టు వద్ద 70 మందిని, రావులపాలెం వద్ద మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఆయా స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
మలికిపురం స్టేషన్లో..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు
-
Politics News
JP Nadda: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయం.. అభివృద్ధే మా ధ్యేయం: జేపీ నడ్డా
-
General News
Polavaram: ఎప్పటికైనా పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే: తెదేపా నేతలు
-
India News
Helicopter ride: చదువుల్లో మెరిసి.. హెలికాప్టర్లో విహారంతో మురిసిన విద్యార్థులు!
-
India News
Odisha Train Tragedy: బాహానగా బజార్ రైల్వేస్టేషన్కు ‘సీబీఐ’ సీల్.. అప్పటివరకు రైళ్లు ఆగవు!
-
Politics News
Kiran Kumar Reddy: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే: కిరణ్కుమార్రెడ్డి