వేదన.. తొలగక రోదన..!
అయ్యా.. మా గోడు వినండి. సాంత్వన చేకూర్చండని వేడుకుంటున్నా.. మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని.. తమ వేదన విని ఊరుకోవడమే కానీ.. రోదన ఆపేదెవరని వాపోయారు.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
అయ్యా.. మా గోడు వినండి. సాంత్వన చేకూర్చండని వేడుకుంటున్నా.. మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని.. తమ వేదన విని ఊరుకోవడమే కానీ.. రోదన ఆపేదెవరని వాపోయారు. కలెక్టర్కు విన్నవించుకుంటే సమస్యలు తొలగుతాయనే ఆశతో కలెక్టరేట్కు వచ్చామని అర్జీదారులు తెలిపారు.
కొవిడ్ బిల్లులు రాలేదు
- ముప్పర్తి నాని, మోరిపాడు
మాది సఖినేటిపల్లి మండలం మోరిపాడు పంచాయతీ. 2021 మే 22న అప్పటి కలెక్టర్ మురళీధర్రెడ్డి మా గ్రామంలోని సుబ్బమ్మ ఆసుపత్రిలో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారు. ఏడు నెలల పాటు రోగులకు వైద్య సేవలందించారు. ఆ వ్యవధిలో రోగులకు అవసరమైన తాగునీరు, సిబ్బందికి టెంట్లు, ఇతర అవసరాల నిమిత్తం సుమారు రూ.1.76 లక్షలు ఖర్చు చేశాం. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అప్పుల వాళ్లకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చా.
నా కొడుకు గెంటేస్తున్నాడు..
- యలమంచిలి గవరమ్మ
మాది అల్లవరం మండలం. నాకు ఇద్దరు కుమార్తెలు, అయిదుగురు కుమారులున్నారు. వారికి పొలంతోసహా అన్నీ సమానంగా ఇచ్చాం. ప్రస్తుతం నేనుంటున్న ఇల్లు నా భర్త నిర్మించారు. నా మూడో కొడుకు ఇల్లు నాది అంటూ గెంటేస్తున్నాడు. మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరుకు విన్నవించుకునేందుకు వచ్చాం.
దివ్యాంగులకు వసతులు కల్పించాలి
- నిమ్మకాయల సురేష్
పదో తరగతి పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్కు వికలాంగ మహాసంఘటన్ తరఫున వినతిపత్రం ఇచ్చాం. దివ్యాంగ విద్యార్థులకు వెసులుబాటు కల్పించమని ప్రభుత్వం జీవో ఇచ్చినా క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పటిష్టంగా అమలుచేయాలని కోరుతున్నాం. ఆ మేరకు కలెక్టర్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే పథకాల అమలు
[ 18-04-2024]
సైకో పాలనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రానున్న రోజుల్లో కూటమి విజయం సాధించి ఎన్నోసంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చాగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య అన్నారు. -
యువకుని ఆత్మహత్య
[ 18-04-2024]
ఆత్రేయపురం మండలం, రాజవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. -
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్