ఉగాదికి గృహప్రవేశం లేనట్టే!
మూడేళ్ల నుంచి జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం సాగుతూనే ఉంది. గృహ ప్రవేశాలకు పెడుతున్న ముహూర్తాలు దాటిపోతున్నా ఇళ్ల నిర్మాణాలు, వసతుల కల్పన పూర్తిస్థాయిలో జరగడం లేదు.
సీతానగరం: చినకొండేపూడిలో పునాదుల దశలోనే నిర్మాణం
న్యూస్టుడే-సీతానగరం: మూడేళ్ల నుంచి జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం సాగుతూనే ఉంది. గృహ ప్రవేశాలకు పెడుతున్న ముహూర్తాలు దాటిపోతున్నా ఇళ్ల నిర్మాణాలు, వసతుల కల్పన పూర్తిస్థాయిలో జరగడం లేదు. తాజాగా ఉగాదికి కొందరు లబ్ధిదారులకు గృహప్రవేశం కల్పిస్తామని లక్ష్యం నిర్దేశించుకున్నా అదీ పూర్తికాని పరిస్థితి.
‘నవరత్నాలు-పేదలందరికీ’ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం ప్రభుత్వమే చేస్తుంది... గృహ ప్రవేశాలు చేసుకుంటే చాలని ముందుగా చెప్పినా... ఆ తర్వాత లబ్ధిదారులే సొంతంగా నిర్మించుకుంటే నాలుగు విడతలుగా బిల్లు చెల్లిస్తామన్నారు. 2021 జూన్ తర్వాత ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. 2022 మార్చికి పూర్తిచేస్తామన్నారు. ఆశించిన స్థాయిలో నిర్మాణాలు లేకపోవడంతో గడువు పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు గృహప్రవేశాలు వాయిదా పడగా నాలుగోసారి ఈ నెల 22న బుధవారం ఉగాది రోజున భారీ సంఖ్యలో గృహప్రవేశాలు చేసేలా నిర్ణయించారు. ఈ ఉగాదికి కూడా గృహప్రవేశాలు లేవని మరోసారి వాయిదా పడిందని లబ్ధిదారులకు గృహనిర్మాణశాఖ అధికారులు ఇప్పటికే సమాచారమిచ్చారు. ఏప్రిల్ రెండో వారంలో గృహప్రవేశాలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఎందుకిలా..
ఉమ్మడి జిల్లాలో 1,40,000 పైగా ఇళ్లు మంజూరుచేశారు. మూడేళ్లు నుంచి 40,929 ఇళ్లను మాత్రమే పూర్తిచేయగలిగారు. లేఔట్లు కనీస సదుపాయాలకు దూరంగా ఉండడంతో నివాసానికి లబ్ధిదారులు మొగ్గుచూపడం లేదు. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిశీలిస్తే... 298 లేఔట్ల వద్ద ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన భూములు కొనుగోలు చేశారు. ఇందులో 70 శాతానికి పైగా భూములు నిర్మాణాలకు అనుకూలంగా లేవు. చాలాచోట్ల ఊరికి దూరంగా ఉన్నాయి. వ్యవసాయ భూములు కావడంతో పునాదులు తీస్తుంటే ఊట నీరు వస్తుండడంతో నిర్మాణాలు వదిలేశారు. రెండేళ్ల క్రితం భూసేకరణ చేసిన వాటికి పరిహారం అందని పరిస్థితి.
ఇదీ పరిస్థితి...
ఉగాది నాటికి కచ్చితంగా పూర్తిచేసేలా ఆయా మండలాల అధికారులకు గతేడాది డిసెంబరులోనే లక్ష్యాలను నిర్దేశించారు. వీటిని పూర్తిచేసేలా గ్రామసచివాలయం, మండల పరిషత్ కార్యాలయం ఉద్యోగులను గృహ నిర్మాణ శాఖలో భాగస్వామ్యం చేశారు. లక్ష్యాన్ని పూర్తిచేయడంలో ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పలువురు ఇంజినీరింగ్ సహాయకులపై వేటు వేయడంతోపాటు గృహనిర్మాణ శాఖ సిబ్బందికి మెమోలిచ్చారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలపై అవగాహన పెంచేలా అధికార యంత్రాంగం ముందుకొచ్చిన సమయంలో వారంతా సమస్యలను ఏకరవు పెడుతున్నారు. రహదారులు, విద్యుత్తు, తాగునీరు అవసరాలు పెంచకుండా నిర్మాణాలు ఎలా పూర్తిచేయాలంటున్నారు.
నీటికీ కష్టాలే...
జగనన్న కాలనీల్లో శాశ్వత మంచినీటి పథకాల నిర్మాణాలకు గానూ జల్జీవన్ మిషన్లో రూ.కోట్ల నిధులతో పనులు కేటాయించి రెండేళ్లు దాటింది. ఏ లే ఔట్లోనూ పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. తూర్పు గోదావరి జిల్లాలో పరిశీలిస్తే... 306 లే ఔట్ల్లో రాజమహేంద్రవరం డివిజన్లో 100 తాగునీటి పథకాలకు రూ.5,208.12 కోట్లు, కొవ్వూరు డివిజన్లో 168 పనులకు గానూ రూ.1,749.80 కోట్లు కేటాయించారు. ప్రతి చోటా 20 వేల లీటర్ల సామర్థ్యం నుంచి 40 వేల లీటర్ల నిల్వలు చేసే నీటి ట్యాంకులతోపాటు పైపులైన్ పనులు ఇతరత్రా పనులు చేసేలా నిధులు కేటాయించారు. రెండేళ్ల నుంచి ఈ పనులన్నీ టెండర్ల దశలోనే ఉండిపోయాయి. ప్రస్తుతం మూడోసారి టెండర్లు పిలిచేందుకు చూస్తున్నారు.
* ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, మిగతా రూ.30 వేలు ఉపాధి హామీ పథకంలో వేతనాల రూపంలో బిల్లులిస్తున్నారు.
వాయిదా పడింది..
- పరశురామ్, పథక సంచాలకుడు, జిల్లా గృహనిర్మాణశాఖ
ఈ నెల 22న చేయాల్సిన గృహప్రవేశాలు వాయిదాపడ్డాయి. ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేసేందుకు అంతా కలిసి కృషిచేస్తున్నాం. నిర్మాణాలకు అవసరమైన సామగ్రి కూడా సిద్ధం చేశాం. జిల్లాలో ప్రస్తుతం రూఫ్ లెవెల్ దశలో 1,791 ఇళ్లు ఉన్నాయి. వీటిని పూర్తిచేసేందుకు కొన్ని పనులు చేపడితే సరిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు