తెలుగుతమ్ముళ్ల విజయోత్సాహం
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన క్యాంపు రాజకీయాలను వైకాపా నాయకులే ఛీ కొట్టారని కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్కుమార్ అన్నారు.
గండేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నినాదాలు
కాకినాడ నగరం, న్యూస్టుడే: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన క్యాంపు రాజకీయాలను వైకాపా నాయకులే ఛీ కొట్టారని కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్కుమార్ అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపొందడం గొప్ప విషయం అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నడూలేని విధంగా క్యాంపు రాజకీయాలకు తెరతీశారన్నారు. తాము ఎటువంటి ప్రలోభాలు, క్యాంపు రాజకీయాలు చేయలేదన్నారు. శాసన మండలి తమకు అవసరం లేదని అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఇప్పుడు అదే ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపారంటూ జగన్ను విమర్శించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మొన్న గ్రాడ్యుయేట్లు బైబై జగన్ అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు తరిమి కొట్టారన్నారు. సామర్లకోట: ఎమ్మెల్యేల కోటాలో పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో సామర్లకోటలో తెదేపా పట్టణ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మఠం సెంటర్లో భారీఎత్తున సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చారు. తీన్మార్ డప్పులతో నృత్యాలు చేశారు. నాయకులు బడుగు శ్రీకాంత్, కంటే జగదీస్మోహన్, యార్లగడ్డ రవిచద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
* జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో తెదేపా శ్రేణులు సంబరాలు చేశాయి.
ఎమ్మెల్సీ విజయంతో నూతనోత్తేజం
కొవ్వూరులో కేకు కోస్తున్న ద్విసభ్య కమిటీ సభ్యుడు సుబ్బరాయచౌదరి, నాయకులు
కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: రాబోయే ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యమని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చిందని ఆ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన నేపథ్యంలో నియోజకవర్గ కార్యాలయంలో గురువారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. కేక్ కోసి, మిఠాయిలు పంచారు. బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు దాయన రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుతమ్ముళ్ల విజయోత్సాహం
మామిడికుదురులో మాజీ మంత్రి గొల్లపల్లి, తెదేపా నాయకులు
మామిడికుదురు, న్యూస్టుడే: పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా సాధించిన ఘన విజయాలతో వైకాపా పాలనపై అందరిలోనూ ఉన్న తీవ్ర వ్యతిరేకత స్పష్టమైందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేలకే ఆ పాలనపై నమ్మకం పోయిందన్న విషయం తేటతెల్లమవుతోందన్నారు. ఎమ్మెల్సీగా అనురాధ విజయం పట్ల మామిడికుదురులోని 216 జాతీయ రహదారి కూడలిలో గురువారం రాత్రి జరిగిన హర్షాతిరేకాల్లో ఆయన పాల్గొన్నారు. బాణసంచాతో సందడి చేశారు. అందరికీ మిఠాయిలు పంచారు. తెదేపా మండల అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్, నాయకులు ఈలి శ్రీనివాస్, బోనం బాబు, చుట్టుగుల్ల కిషోర్, జాలెం సుబ్బారావు, సుందరనీడి చిన్ని, తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం పట్టణం: వైకాపా దుర్మార్గ పాలన త్వరలో కనుమరుగవుతుందని, వచ్చే ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధిస్తుందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయంతో అమలాపురం గడియారస్తంభం కూడలి వద్ద తెదేపా నాయకులు గురువారం రాత్రి హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేశారు. మిఠాయిలు పంచారు. డి.సత్తిబాబురాజు, అల్లాడ సోంబాబు, కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, జిల్లా మహిళాధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, వలవల శివరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్