హక్కుల సాధనకు బీసీలు పోరాడాలి: ఎంపీ
బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, అందరినీ కలుపుకొంటూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఎంపీ భరత్రామ్ అన్నారు.
చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎంపీ, బీసీ జేఏసీ ఛైర్మన్ తదితరులు
వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం) :
బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, అందరినీ కలుపుకొంటూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఎంపీ భరత్రామ్ అన్నారు. నగరంలోని హోటల్ ఆనంద్ రీజెన్సీలో గురువారం జరిగిన శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎంపీతోపాటు బీసీ జేఏసీ ఛైర్మన్ మార్గాని నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గంలో ఉన్న ఐక్యత మిగిలిన బీసీ వర్గీయుల్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. మనలో ఏ ఒక్కరు ప్రజాప్రతినిధిగా ఉన్నా మరో పది మందిని పైకి తీసుకురావచ్చని, అంతేగానీ అసూయతో కాళ్లు పట్టుకుని కిందకు లాగేస్తే ఎప్పటికీ మన లక్ష్యాన్ని చేరుకోలేమన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు బీసీలకే ఇచ్చేలా అన్ని పార్టీలపై ఒత్తిడి చేయాలన్నారు. అనంతరం బీసీ సంఘీయుల్లో వివిధ రంగాల్లో ఉన్న పలువురిని ఎంపీ చేతుల మీదుగా సన్మానించారు.
పొగాకు రైతుల సంక్షేమానికి కృషి
గోపాలపురం: ఎన్ఎల్ఎస్ పొగాకు రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రైతులతో కొంతసేపు మాట్లాడుతూ పొగాకు రైతులు కోరుతున్న విద్యుత్ రాయితీ గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతానన్నారు. గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం ఆయన కొనుగోళ్లను ప్రారంభించారు. ముందుగా ఎంపీ, రైతులు పూజలు చేశారు. మొదటి రోజు 27 బేళ్లు వేలానికి రాగా, అత్యధికంగా కిలో పొగాకు ధర రూ.210 పలికింది. అన్ని బేళ్లను ఆయా కంపెనీల వారు అదే ధరకు కొనుగోలు చేశారు. పొగాకు బోర్డు రీజియన్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో గురువారం కొనుగోళ్లు ప్రారంభమైనట్లు తెలిపారు. ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, వేలం నిర్వహణాధికారి ఆది శేషయ్య, రైతుసంఘ అధ్యక్షుడు పిన్నమనేని మధుమోహన్, పొగాకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.