వంతెన నిర్మాణంపై 27న సమావేశం
వశిష్ఠ గోదావరి నదీపాయకు మధ్యలో రూ.49.50కోట్ల నిధులతో చేపట్టే వంతెన నిర్మాణానికి అన్ని అనుమతులు రావడంతో పనులు ప్రారంభించే దిశగా పంచాయతీరాజ్శాఖ ఇంజినీరింగ్ అధికారులు ముందుకెళ్తున్నారు
పి.గన్నవరం, న్యూస్టుడే: వశిష్ఠ గోదావరి నదీపాయకు మధ్యలో రూ.49.50కోట్ల నిధులతో చేపట్టే వంతెన నిర్మాణానికి అన్ని అనుమతులు రావడంతో పనులు ప్రారంభించే దిశగా పంచాయతీరాజ్శాఖ ఇంజినీరింగ్ అధికారులు ముందుకెళ్తున్నారు. ఈ వంతెన నిర్మాణ ప్రాంతాలను శుక్రవారం పంచాయతీరాజ్శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ బి.బాలునాయక్ పరిశీలన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీరాజ్శాఖ ఇంజినీరింగ్ అధికారి కె.చంటిబాబు, డీఈఈ ఎ.రాంబాబు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ అధినేత పి.పి.రాజు శనివారం కలెక్టర్ హిమాన్షుశుక్లాను కలిసి వంతెన నిర్మాణ ప్రక్రియను వివరించారు. పనులు వేగంగా సాగేందుకు వీలుగా ఈ నెల 27న కలెక్టరేట్లో పంచాయతీరాజ్, మైన్స్, విద్యుత్, ర.భ., ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులతో కలెక్టర్ హిమాన్షుశుక్లా సమావేశం ఏర్పాటుచేస్తారని డీఈఈ రాంబాబు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?