కౌలు రైతుపై క‘రుణ’ లేమి
నేడు కౌలు రైతులే లేకుంటే సేద్యమే లేదేమో.. పంటల విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వ్యవసాయం కౌలు రైతుల మీదే ఆధారపడి ఉంది.
న్యూస్టుడే, ముమ్మిడివరం, మండపేట: నేడు కౌలు రైతులే లేకుంటే సేద్యమే లేదేమో.. పంటల విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వ్యవసాయం కౌలు రైతుల మీదే ఆధారపడి ఉంది. అధిక శాతం కౌలు రైతులకు ప్రభుత్వ చేయూత అందటం లేదు. ఏటా విపత్తుల వల్ల నష్టాలు ఎదురవుతున్నా నేల తల్లినే నమ్ముకున్న కౌలు రైతులు క్రమంగా రుణభారంతో కుంగిపోతున్నారు. ప్రభుత్వపరంగా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) పొందలేక కొందరు.. పొందినా బ్యాంకుల నుంచి రుణాలు విడుదల కాక మరికొందరు కౌలు రైతులు పెట్టుబడికి ప్రైవేటుగా అధిక వడ్డీలకు రుణాలు తేక తప్పటం లేదు.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 1.78 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, సుమారు 1.30 లక్షల ఎకరాల సాగును కౌలు రైతులే చేస్తున్నారు. వీరికి ఎకరాకు ఖరీఫ్లో రూ.40 వేలు, రబీలో రూ.48 వేలకు పైగా పెట్టుబడి అవసరమవుతోంది. వారిలో అధిక శాతం రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు దక్కటం లేదు. అధిక వడ్డీలకు అప్పు చేయడమో, బంగారం ఉంటే కుదువ పెట్టడమో చేస్తేనే పెట్టుబడి సమకూరుతుంది.
‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కౌలు రైతులకు రుణాల విడుదల లక్ష్యం రూ.4 వేల కోట్లు. బ్యాంకులు మొదటి 9 నెలల్లో (డిసెంబరు వరకు) రూ.1,126 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి. లక్ష్యంలో 1,63,811 మంది కౌలు రైతుల ఖాతాలకే పంట రుణ పొడిగింపును వర్తింపజేశారు. ఇది కేవలం 49.37 శాతం మాత్రమే. కౌలు రైతులకు బ్యాంకులు మరింత బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది.’’ ఈనెల 11న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపిన సమాచారమిది..
సీసీఆర్సీ కార్డులున్నా...
జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 59,800 సాగు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) ఇచ్చారు. జిల్లాలో 40 శాతం కౌలు రైతులకు మాత్రమే ఆ పత్రాలు లభించాయి. ఈకార్డున్న ప్రతి కౌలు రైతుకూ పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా అమలు కావడం లేదు. కౌలుకిచ్చిన భూ యజమాని ముందే రుణం తీసుకుని ఉంటున్నారు.
జేఎల్జీలతో మేలేదీ..
కౌలు రైతులకు పంట రుణాలు ఇప్పించాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ప్రతి ఐదుగురు కౌలు రైతులతో ఒక్కో జాయింట్ లయబిలిటీ గ్రూప్ (జేఎల్జీ)ను ఏర్పాటు చేయ సంకల్పించింది. ఈ గ్రూపుల వల్లా కౌలు రైతులకు రుణ పరపతి మెరుగుపడలేదు. గ్రూపు సభ్యుల్లో ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు ఎకరాలు కౌలు చేస్తున్నా వారికి బ్యాంకులు గరిష్ఠంగా రూ.2 లక్షలు మాత్రమే రుణం ఇస్తున్నట్లు సమాచారం. గ్రూపులో ఏరైతు రుణం తీసుకున్నా దాన్ని తిరిగి చెల్లించకపోతే మిగిలిన రైతులకు అడుగుతారనే తలంపుతో జేఎల్జీలోని మిగతా వారు ఆసక్తి చూపడం లేదు. సీసీఆర్సీ కార్డులున్న కౌలు రైతులకూ బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం విడుదల చేయటం లేదు. వారు సాగు చేసే విస్తీర్ణంతో సంబంధం లేకుండా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు రుణం ఇస్తున్నాయంతే. జిల్లాలో కౌలు రైతులకు రూ.30.90 కోట్ల రుణాలిస్తే.. సీసీఆర్సీ కార్డు పొందిన కౌలు రైతులకు ఇచ్చింది రూ.12 కోట్లే. మిగిలిన 18.90 కోట్లు జేఎల్జీ గ్రూపు సభ్యులకు అందజేశారు. పంట రుణాలకు సంబంధించి కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు కావడం లేదు. ఖరీఫ్లో ఎకరాకు రూ.42 వేలు, రబీ పంటకైతే రూ.46 వేలకు ఈ ఏడాది జనవరిలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిమితి పెంచినా ఆమేరకు కౌలు రైతులకు రుణాలు విడుదల కావడం లేదు. జిల్లాలో డిసెంబరు నాటికి రూ.4113 కోట్లు పంట రుణాల విడుదల లక్ష్యంకాగా, వాటిలో అసలు రైతులకే రూ.3,134 కోట్లు, అంటే 80 శాతం వరకు రుణాలు విడుదలవ్వడం గమనార్హం.
హామీ ఇస్తేనే దక్కేది..
కౌలు రైతులు పంట రుణాలు పొందడం గగనమే. నేను 8 ఎకరాలు కౌలు చేస్తున్నా. సుమారు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతున్నా. ఏటా సీసీఆర్సీ కార్డు పునరుద్ధరించుకుంటున్నా. ఎప్పుడూ బ్యాంకులో రుణం దక్కలేదు. భూ యజమాని హామీ ఇస్తే బ్యాంకులో పంట రుణం ఇస్తామంటున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నా. -నిమ్మకాయల జీవన్కుమార్, కౌలు రైతు, మండపేట
మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం..
కౌలు రైతులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం. పంటలకు ఈ-క్రాప్ చేయించుకుని, ఆ సర్వే నంబర్ల ఆధారంగా అసలు రైతు రుణం పొందితే కౌలు రైతుకు ఇవ్వడానికి అవకాశం లేదు. కౌలు రైతులు జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే రుణాలు అందించడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో రూ.18.90 కోట్లు జేఎల్జీ గ్రూపులకు పంట రుణాలు ఇచ్చారు. సీసీఆర్సీ కార్డులున్న కౌలు రైతులకు వ్యక్తిగతంగా పంట రుణాలు రూ.12 కోట్లు ఇచ్చాం. -కె.లక్ష్మీనారాయణ, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజరు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు