వేతన వేదన.. ఆర్థిక యాతన
రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా వైద్యశాలను బోధనాసుపత్రిగా మార్చి వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సేవలు, రోగుల తాకిడి పెరిగాయి.
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి ఎదుట సిబ్బంది నిరసన
రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా వైద్యశాలను బోధనాసుపత్రిగా మార్చి వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సేవలు, రోగుల తాకిడి పెరిగాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా రీస్ట్రక్చరింగ్ పేరుతో వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్న ఇక్కడి వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులను చాలా మందిని సీహెచ్సీలు, ప్రాంతీయ ఆసుపత్రులకు గతేడాది అక్టోబర్ నుంచి బదిలీ చేసేశారు. ఇందులో కొందరు వైద్యులు, ఇతర సిబ్బందిని ఫారిన్ డిప్యుటేషన్ పేరుతో ఇక్కడే ఉంచి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి వారి స్థానంలో కొత్త సిబ్బంది వచ్చేంత వరకు పనిచేయాలని ఆదేశించారు. అలా ఆసుపత్రిలో ఉన్న మొత్తం 87 మందికి రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ ఏడాది జనవరికి ముందు వెళ్లిపోయిన వైద్యులు, సిబ్బందికి వేతనాలు అందినా జనవరి తరువాత వెళ్లేవారికి, ఇంకా ఇక్కడే పనిచేస్తున్న వారికి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం: ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ)లో పనిచేసే ఉద్యోగులను డీఎంఈ పరిధిలోకి తెచ్చేవరకు రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో కొత్తవారు వచ్చేవరకు ఫారిన్ డిప్యూటేషన్ పద్ధతిన పనిచేయాలన్నారు. వీరికి వేతనాలు సైతం డీఎంఈ నుంచి రావాల్సి ఉంది. ఏపీవీవీపీ తరఫున పనిచేయడం లేదు కనుక వారు వేతనాలు నిలిపివేశారు. డీఎంఈలో ఉన్నట్లు ట్రెజరీలో మ్యాపింగ్ జరిగితే వేతనాలు వస్తాయని చెబుతున్నా అది జరగలేదు. ఎవర్ని అడగాలో తెలియక.. వేతనాలు ఎప్పుడొస్తాయో చెప్పేవారు లేక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏపీవీవీపీ, అటు డీఎంఈ నుంచైనా వెంటనే వేతనాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన
సమస్యపై సర్వజన ఆసుపత్రి ఎదుట సిబ్బంది ఆందోళన నిర్వహించారు. జనవరి నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.రమేష్ వినతిపత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, మినిస్టీరియల్ ఉద్యోగులు, పారామెడికల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కోడ్ బదిలీతో కష్టాలు
ఏపీ వీవీపీ నుంచి డీఎంఈకి డీడీవో కోడ్ ట్రాన్స్ఫర్ అవ్వడంలో ఇబ్బందుల వల్ల వేతనాలకు అంతరాయం ఏర్పడిందని సీఎఫ్ఎంఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ 87 మందిలో స్టాఫ్ నర్సులు 40 మంది ఉండగా వీరిలో 21 మంది డీఎంఈలో ఉండేందుకు అంగీకారం తెలిపినా వారికీ వేతనాలు రావడం లేదు. వీరికి సంబంధించి ఇక్కడ రెగ్యులర్ నర్సులకు డీఎంఈలో కాంట్రాక్టు అని జీవో రావడంతో వేతనాలకు బ్రేక్ పడినట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని అంతా కోరుతున్నారు.
త్వరలోనే అందుతాయి...
సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. డీఎంఈ అధికారులు సచివాలయానికి సమస్యను తీసుకెళ్లారు. పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పర్యవేక్షిస్తున్నాం. త్వరలో సీఎఫ్ఎంఎస్ కోడ్ ఇబ్బందులు తొలగి అందరికీ వేతనాలు అందుతాయి.
డాక్టర్ రమేష్, సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!