అక్రమంగా.. అధరకొట్టేద్దామని..
గరువు పర్రకోటి వంతెన సమీపంలో ఇటీవల ఓ లేఔట్ వెలిసింది. ఈ లేఔట్కు పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేసేశారు. పంచాయతీ అధికారులు హెచ్చరించినా యజమానులు స్పందించకపోవడంతో చివరికి లేఔటు వద్ద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోపాటు నోటీసు అంటించారు.
జిల్లా కేంద్రం అమలాపురం మండలం కామన
న్యూస్టుడే, అమలాపురం గ్రామీణం
జనుపల్లెలో పంచాయతీ అనుమతులు లేకుండా వెలసిన లేఔట్
* గరువు పర్రకోటి వంతెన సమీపంలో ఇటీవల ఓ లేఔట్ వెలిసింది. ఈ లేఔట్కు పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేసేశారు. పంచాయతీ అధికారులు హెచ్చరించినా యజమానులు స్పందించకపోవడంతో చివరికి లేఔటు వద్ద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోపాటు నోటీసు అంటించారు.
* అమలాపురం మండలం జనుపల్లె మన్నాకాలనీలో పంచాయతీ అనుమతులు లేకుండా కొద్దిరోజుల క్రితం లేఔట్ ఏర్పాటు చేశారు. అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పంచాయతీ అధికారులు చెప్పినప్పటికీ వినకుండా రోడ్లు వేసేశారు. పంచాయతీ అధికారులు లేఔట్కు నాలుగువైపులా అనధికార లేఔట్ అని బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు.
కాస్త పెట్టుబడి, అధికార అండ ఉంటే.. తక్కువ కాలంలో రూ.కోట్లకు పడగలెత్తొచ్చనే దురాశతో కొందరు లేఔట్లు వేసేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేసే విషయంతో అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిఉన్నా.. చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అమలాపురం పట్టణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం కావడంతో రియల్టర్లు వ్యవసాయ భూములను లేఔట్లుగా చేసి అమ్మేసేందుకు బరితెగిస్తున్నారు. పట్టణ సమీప గ్రామాల్లో వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అమలాపురం పురపాలిక మాస్టర్ ప్లాన్ పరిధిలోకి మండలంలోని పలు గ్రామాలు వస్తున్నాయనే ప్రచారంతో లేఔట్లుగా వేసే భూముల్లో రహదారులు నిర్మించేస్తున్నారు.
కామనగరువు పర్రకోటి వంతెన సమీపంలో అనధికార లేఔట్
నిబంధనలు పక్కకు నెట్టి..
గ్రామాల్లో లేఔట్లు వేయాలంటే పంచాయతీ, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకోవాలి. సంబంధిత స్థలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. సామాజిక అవసరాలకు 10 శాతం స్థలం కేటాయించాలి. వీటితోపాటు లేఔట్లో ప్రధాన, అంతర్గత రోడ్లు 33-40 అడుగులు వెడల్పు ఉండేలా ఏర్పాటు చేయాలి. గ్రామీణ మండలంలో ఏర్పాటుచేసే లేఔట్లలో ఈ నిబంధనలేమీ అమలు చేయడం లేదు. లేఔట్లు వేసే ప్రాంతం ఎవరికీ కనిపించకుండా చుట్టూ పచ్చటి వస్త్రంకట్టి రోడ్లు వేసేస్తున్నారు. పంచాయతీ అధికారులు ఆ లేఔట్ల వద్దకు వస్తే అధికార పార్టీ నాయకులతోపాటు అండదండలుండే వ్యక్తులతో ఫోన్ చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
గ్రామీణంలోనే అధికంగా..
అమలాపురం గ్రామీణ మండలంలో 22 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలోని సుమారు పది గ్రామాలు పట్టణానికి ఆనుకుని ఉండటంతో లేఔట్లు వేసేస్తున్నారు. లేఔట్ ఏర్పాటుచేసే ముందు పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోకున్నా.. వారికి అడ్డు ఉండడం లేదు. దీంతో అనధికార లేఔట్ల సంఖ్య రోజురోజుకీ అధికమవుతోంది. గతేడాది నుంచి ఇప్పటివరకు సుమారు 20 వరకు లేఔట్లు గ్రామీణ మండలంలో వెలిశాయి. కామనగరువు, బండారులంక, పేరూరు, సమనస, జనుపల్లె, తాండవపల్లి, నడిపూడి, పాలగుమ్మితోపాటు పలు ప్రాంతాల్లో లేఔట్ల సంస్కృతి విస్తరిస్తోంది.
నోటీసులిస్తున్నాం..
- జి.మల్లికార్జునరావు, ఇన్ఛార్జి డీఎల్పీవో, అమలాపురం
గ్రామ పంచాయతీల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఔట్లను గుర్తించి వారికి నోటీసులు ఇస్తున్నాం. లేఔట్ల వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అనధికార లేఔట్లలో భూములు కొనుగోలు చేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర