కాలువల నిర్వహణకు రూ.5 కోట్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరి సాగు ప్రజల జీవనాడి. దీనికి సాగు, మురుగు కాలువల వ్యవస్థ కీలకంగా పనిచేయాలి. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్లో 5.50 లక్షల ఎకరాలు, రబీలో సుమారు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతోంది.
పి.గన్నవరం, న్యూస్టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరి సాగు ప్రజల జీవనాడి. దీనికి సాగు, మురుగు కాలువల వ్యవస్థ కీలకంగా పనిచేయాలి. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్లో 5.50 లక్షల ఎకరాలు, రబీలో సుమారు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతోంది. పంట, మురుగు కాలువలకు రానున్న ఖరీఫ్ మొదలు రబీ పూర్తయ్యే వరకు
నిర్వహణ పనులు సుమారు ఏడాదిపాటు చేస్తారు. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో పంట, మురుగు కాలువల నిర్వహణ పనులు తదితర అంశాలపై జలవనరుల శాఖ ఎస్ జి.శ్రీనివాసరావుతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించగా వివరాలు వెల్లడించారు.
న్యూస్టుడే: రానున్న ఖరీఫ్...రబీ సీజన్లో సాగు, మురుగు కాలువల నిర్వహణ పనులకు నిధుల కేటాయింపు ఏ విధంగా ఉంటుంది.?
ఎస్ఈ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్సు (ఒఅండ్ఎం)కు రూ.5 కోట్లతో పనులు చేస్తాం. మొత్తం 150 పనులు ప్రతిపాదించాం. వీటిలో 90 పనులు పంట కాలువలు, 60 మురుగు కాలువలకు సంబంధించినవి.
రబీ అనంతరం కాలువలు కట్టేసి తెరిచేలోగా ఏమైనా నిర్వహణ పనులు చేస్తారా...?
ఎస్ఈ: పంట, మురుగుకాలువల్లో పూడికతీత పనులు చేసేందుకు డాక్టర్ బి.ఆర్.అంబ్కేర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రూ.45 లక్షలు, కాకినాడ కలెక్టర్ రూ.15 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో అత్యవసరమైన పూడికతీత పనులు చేస్తాం.
ధవళేశ్వరం బ్యారేజీ నిర్వహణ పనులకు నిధులేమైనా ఉన్నాయా...?
ఎస్ఈ: బ్యారేజీ తలుపులకు మరమ్మతులు చేసేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా ప్రత్యేకించి రూ.25 లక్షలు మంజూరు చేశారు. వీటితో అత్యవసరమైన మరమ్మతులు చేస్తాం. పూర్తిగా మరమ్మతులు చేయాలంటే రూ.56 కోట్లు కావాలి. కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇంకా మంజూరు కాలేదు.
ఈ క్లోజర్ పీరియడ్లో గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్ఈ: ప్రత్యేకించి నిధులు లేవు.
ఏలేరు ఆధునికీకరణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
ఎస్ఈ: ఏలేరు ఆధునికీకరణకు రూ.700 కోట్లు కావాలి. గత ఏడాది నవంబరులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇంకా నిధులు విడుదల కాలేదు.
ధవళేశ్వరం సర్కిల్ పరిధిలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కువగా ఇన్ఛార్జులతో నెట్టుకొస్తున్నారు. దీనిని ఎలా చక్కదిద్దుతారు..?
ఎస్ఈ: రెండు ఈఈ, నాలుగు డీఈఈ, పది జేఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ఛార్జిలతో పనులు చేయిస్తున్నాం. పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వానికి పంపాం.
రబీలో సాగునీటి ఎద్దడిని ఎలా అధిగమిస్తున్నారు?
ఎస్ఈ: బ్యారేజీ ఎగువ నుంచి 1,500 క్యూసెక్కుల నీరు వస్తుంది. సీలేరు ద్వారా మరో 5,500 క్యూసెక్కులు సరఫరా అవుతుంది. మొత్తం ఏడువేల క్యూసెక్కుల నీటిని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు పంపిణీ చేస్తున్నాం. శివారు ఆయకట్టుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి సాగునీటి ఎద్దడిలేకుండా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో రబీ వరికోతలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సాగునీటి వినియోగం తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
[ 28-03-2024]
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!