సొమ్ముల్లేవ్.. షాకులే!
పల్లెలే దేశప్రగతికి పట్టుగొమ్మలన్న మహాత్ముని మాటలు అమలు చేయాల్సిన పాలకులు.. వాటి నిర్వహణ, అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా, గ్రామాల్లో మౌలిక వసతులకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులను ముక్కుపిండి వెనక్కి లాగేస్తున్నారు.
ఈనాడు, రాజమహేంద్రవరం - న్యూస్టుడే, ధవళేశ్వరం, గోకవరం
అల్లవరం గ్రామ పంచాయతీ కార్యాలయం
పల్లెలే దేశప్రగతికి పట్టుగొమ్మలన్న మహాత్ముని మాటలు అమలు చేయాల్సిన పాలకులు.. వాటి నిర్వహణ, అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా, గ్రామాల్లో మౌలిక వసతులకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులను ముక్కుపిండి వెనక్కి లాగేస్తున్నారు. ఇప్పటికే నిధుల్లేక నీరసించిన పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల బకాయిలు చెల్లించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలు ‘మూలిగే నక్కపై పడిన తాటిపండు’ చందంలా తయారైంది. ఇటీవల పంచాయతీ పాలకవర్గాలకు తెలియకుండా ఆర్థిక సంఘం నిధులు వెనక్కి తీసుకుని విద్యుత్తు బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ దఫా రూటుమార్చారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి పన్నుల రూపేణా సమకూరిన సాధారణ నిధులు, పంచాయతీల్లో ఉన్న ఆర్థిక సంఘం నిధులతో వెంటనే విద్యుత్తు బకాయిలు చెల్లించాలనే ఒత్తిడి పెరిగింది. వెరసి పాలకవర్గాలు, కార్యదర్శులు ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారు.
వసతులు సమకూరేదెలా..
గ్రామాల్లో కనీస అవసరాలు, వసతుల కల్పనకు ఆర్థిక సంఘం, సాధారణ నిధులు అవసరం. ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు తదితరాలకు కేటాయించాలి. సాధారణ నిధుల లభ్యత మేరకు పాలకవర్గ ఆమోదంతో అభివృద్ధి పనులు చేసుకునే వీలుంది. విద్యుత్తు బిల్లులు సైతం ఏళ్లుగా చెల్లించక.. విద్యుత్తు ఛార్జీలు, సర్ఛార్జీలతో కలిపి ఆ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో అవి తలకు మించిన భారంగా మారాయి. ఇప్పటికే 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో మూడొంతుల మేర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో అంతంతగానే అందుబాటులో ఉన్నాయి. మైనర్ పంచాయతీల్లో అయితే కనీస నిల్వలే ఉన్నాయనే వాదన ఉంది.
ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు
పంచాయతీ ఖాతాల్లో నిధులు లేక కటకటలాడుతున్నాయి. మైనర్ పంచాయతీల్లో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆస్తి, నీటి పన్ను రూపంలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరలోపు మాత్రమే ఆదాయం వస్తోంది. వీటిలోనే వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతులు, సిబ్బంది వేతనాలు తదితర అవసరాలు తీర్చుకోవాలి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఆస్తి, నీటి పన్ను నూరు శాతం వసూళ్లే లక్ష్యంగా క్షేత్రంలో సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులతో విద్యుత్తు బకాయిలు ఎలా చెల్లించగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. సాధారణ నిధులు సమకూరితే వాటిలో కొంతైనా బిల్లుల రూపంలో తీసుకుందామని అనుకునేవారికి తాజా నిర్ణయం ఇరకాటంలో పడేస్తోంది.
ఎలా సాధ్యం..
రావులపాలెం మేజర్ పంచాయతీ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.2.05 కోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఇక్కడ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.85 వేలు, సాధారణ నిధులు రూ.30 లక్షల మేర ఉన్నాయి. విద్యుత్తు శాఖకు ఏకంగా రూ.97 లక్షల బకాయి చెల్లించాలి. ఇదిలా ఉండగా ఈ పంచాయతీలో నెలకు పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది వేతనాలు, వాహనాలకు డీజిల్ ఇతర ఖర్చులు రూ.15 లక్షలు కావాలి. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు బకాయిలు చెల్లిస్తే నిర్వహణ ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
రూ.1.7 కోట్లు కట్టాలట
- కొమరం శ్రావణి, గోకవరం సర్పంచి
గోకవరం పంచాయతీకి నెలకు రూ.3.5 లక్షలు వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది. ఈ బిల్లుల నిమిత్తం రూ.70 లక్షల వరకు ఆర్థిక సంఘం నిధుల నుంచే నేరుగా చెల్లించి మిగిలిన సొమ్ము పంచాయతీలకు జమ చేశారు. అయినా రూ.1.7 కోట్లు బిల్లులు బకాయి ఉన్నట్లు డిమాండ్ నోటీసులు ఇచ్చారు.చెల్లించిన బిల్లులను మినహాయించాలని కోరినా సరైన స్పష్టత ఇవ్వడం లేదు. దీనికితోడు సర్ఛార్జీల పేరుతోనూ బాదేస్తున్నారు. వీటన్నింటిని కలిపి బకాయిలుగా చూపడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు ఆదేశించాం
-జగదాంబ, డీపీవో, తూర్పుగోదావరి
దీర్ఘకాలంగా బకాయి ఉన్న విద్యుత్తు బిల్లులు చెల్లించాలని పంచాయతీలకు సూచించాం. పంచాయతీల నిర్వహణలో భాగంగా వినియోగిస్తున్న విద్యుత్తుకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఎంత త్వరగా బకాయిలు చెల్లిస్తే అంత ఆర్థిక భారం తప్పుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
[ 28-03-2024]
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్