పారదర్శకంగా నియామకాలు
వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల నియామకాలు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నామని జోన్-2 (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు) ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ పద్మాశశిధర్ పేర్కొన్నారు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల నియామకాలు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నామని జోన్-2 (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు) ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ పద్మాశశిధర్ పేర్కొన్నారు. వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ చేపట్టి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియామకాల్లో దళారీ వ్యవస్థను నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త పోస్టులు, బదిలీల కౌన్సెలింగ్, పీహెచ్సీల్లో క్యాడర్ను పూర్తిస్థాయిలో నియమించడం తదితర అంశాలపై ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..
* జీవో 143 ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు: జీవో నంబరు 143 ప్రకారం ప్రతి పీహెచ్సీలో అన్ని కేటగిరీలకు సంబంధించి 14 మంది సిబ్బంది ఉండాలన్న నిబంధన మేరకు ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లా పరిధిలోని 130కి పైగా పీహెచ్సీల్లో నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఎంపీహెచ్ఈవోలకు కౌన్సెలింగ్ చేపట్టి ఆయా చోట్ల పోస్టింగులు ఇస్తున్నాం. ఇప్పటికే 245 కొత్త స్టాఫ్నర్సు పోస్టులకు నియామకాలు చేశాం. జోన్-2లోని 170 ఎంపీహెచ్ఈవో/సీహెచ్వో పోస్టులను పీహెచ్సీల్లో మార్పులు చేస్తున్నాం.
* దళారులను నమ్మి మోసపోవద్దు:
ఇటీవల కాలంలో ఎంఎల్హెచ్పీలు, స్టాఫ్ నర్సుల కొత్త పోస్టింగులు, ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతికి సంబంధించి అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు. కౌన్సెలింగ్, నియామకాలు పారదర్శకంగా చేపడుతున్నాం. కార్యాలయాల్లో అధికారులు తెలుసు.. ఇతర సిఫార్సులు చేయిస్తామని ఎవరైనా అభ్యర్థులు, ఉద్యోగులను ప్రలోభ పెడితే సమాచారమివ్వాలి. అలాంటి వారిని నమ్మి నష్టపోవద్దు.
* హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్లో సేవలు: జోన్-2 పరిధిలో ఇప్పటికే చాలా మంది మిడ్ లెవిల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్హెచ్పీ) నియామకాలు చేపట్టాం. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్న 2,782 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్లో వీరు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. స్టాఫ్ నర్సుకన్నా ఎక్కువ స్థాయి, వైద్యులతో సమానంగా వీరు సేవలందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ