1 నుంచి రబీ ధాన్యం కొనుగోలు
ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని వచ్చే నెల 1 నుంచి కొనుగోలు చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, దీనికి సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్(జేసీ) తేజ్భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులతో సమీక్షిస్తున్న జేసీ తేజ్భరత్
వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం): ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని వచ్చే నెల 1 నుంచి కొనుగోలు చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, దీనికి సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్(జేసీ) తేజ్భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి దూరదృశ్య సమావేశం ద్వారా ధాన్యం సేకరణ కార్యాచరణ, పదోతరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి సరఫరా సమస్యలు తదితర అంశాలపై జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులతో చర్చించారు. జిల్లాలో ముందుగా కోతలు జరిగే అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి తదితర మండలాల్లో సమన్వయ అధికారులు షెడ్యూల్ ప్రకారం రోజువారీ ఎంత ధాన్యం వస్తుందనే అంచనాతో ఉండాలన్నారు. జిల్లాకు 70 లక్షల గోనెసంచులు అవసరమవుతాయని, ఏ మండలానికి ఎన్ని అవసరమో అన్ని సంచులను ముందుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుత రబీ సీజన్లో 4,55,845 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. 18 మండలాల పరిధిలోని 233 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 147 మిల్లులకు అనుసంధానం చేశామన్నారు. ఆయా కేంద్రాలకు నియమించిన సాంకేతిక సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ యంత్రసేవా పథకం లక్ష్యాలను కూడా వేగవంతం చేయాలన్నారు.
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఏ గ్రామంలో అయినా చెరువులు, బోరుపంపులు మరమ్మతు చేయించకుంటే యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. పశువులకు తాగునీటి కోసం ఏర్పాట్లు చేయాలని, పశువుల కోసం గుర్తించిన 128 తాగునీటి ప్రదేశాల్లో తక్షణం మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈసారి వడగాడ్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున దాతల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పదోతరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష
వచ్చే నెల 3 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల ఏర్పాట్లపై జేసీ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఫర్నీచర్, ఫ్యాన్లు, విద్యుత్తు దీపాలు, తాగునీరు వంటి సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు.
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని జేసీ ఆదేశించారు. సచివాలయాల్లో పౌరసేవలు కూడా పెంచాలన్నారు. ప్రతి సచివాలయంలో రోజూ 20 రకాల సేవలు ప్రజలకు అందించాలన్నారు. భూమి రీసర్వేకు సంబంధించి ఫేజ్-2లో చేపట్టిన సర్వే పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను
ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
[ 23-04-2024]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు