తమ్ముడే హంతకుడు
ఆస్తి కోసం అన్నపై అక్కసు పెంచుకున్నాడు. మద్యం తాగి వెళ్లి గొడవపడి, కర్కశంగా అంతమొందించాడు.
పట్టించిన రక్తపు మరక.. హావభావాలు
ఉపసర్పంచి హత్య కేసు ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న కొవ్వూరు డీఎస్పీ వర్మ
కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: ఆస్తి కోసం అన్నపై అక్కసు పెంచుకున్నాడు. మద్యం తాగి వెళ్లి గొడవపడి, కర్కశంగా అంతమొందించాడు. ఆ పెనుగులాటలో అన్న రక్తం తమ్ముడి చొక్కాపై పడింది. పోలీసుల దర్యాప్తులో అదే రక్తపు మరక అతణ్ని పట్టించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సంచలనం రేపిన వేములూరు ఉప సర్పంచి, తెదేపా నాయకుడు శీని సత్య వరప్రసాద్ హత్య కేసులో సొంత తమ్ముడు సత్యనారాయణనే హంతకుడిగా తేల్చారు. కొవ్వూరు డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ సోమవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మద్యం తాగి వచ్చి..
ప్రసాద్ తమ్ముడు శీని సత్యనారాయణ జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురంలో ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో వ్యాపారాలు చేశారు. ఈ క్రమంలో చేసిన అప్పు, వేములూరులోని ఇల్లు, స్థలం విషయంలో గొడవ పడుతున్నారు. అప్పటికే ఇంటిని తనఖా పెట్టడంతో వడ్డీ బాగా పెరిగింది. అందులో కొంత ప్రసాద్ స్నేహితుడైన అక్కిన రాంబాబు తీర్చారు. తనకు ఇంట్లో వాటా కావాలని సత్యనారాయణ అడుగుతుండగా రూ.19.50 లక్షలు ఇస్తేనే వాటా ఇస్తానని ప్రసాద్ చెప్పారు. ఈ విషయంలో 15 రోజులుగా వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. రూ.10 లక్షలు ఇస్తానని చెప్పినా ప్రసాద్ ఒప్పుకోలేదు. దీంతో సత్యనారాయణ ఈనెల 25న వేములూరు వచ్చారు. సమీపంలోని ఓ బార్కు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన గెడా శ్రీనును అక్కడికి రమ్మన్నారు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ద్విచక్ర వాహనంపై రాత్రి 11- 12 గంటల మధ్యలో ప్రసాద్ ఇంటికి వెళ్లారు. అప్పుడు అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. ప్రసాద్ను బయటకు తీసుకొచ్చి పీక పట్టుకుని గోడకు తలను గట్టిగా కొట్టగా ముక్కులోంచి రక్తం వచ్చి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్ను బోర్లా పడుకోబెట్టి పీక నొక్కి చంపాడు. మృతదేహంపై దుప్పటి కప్పి ద్విచక్ర వాహనంపై ఇద్దరూ కొవ్వూరు వచ్చారు. ఆ తర్వాత సత్యనారాయణ జంగారెడ్డిగూడెం వెళ్లిపోయారు.
నిందితుడు సత్యనారాయణ
ఇలా దొరికాడు..
అయిదు బృందాలుగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఇలా ఉండగా సోమవారం సత్యనారాయణ తన వదిన శ్రీకళ (హతుడి భార్య), పిల్లలతో కలిసి వేములూరు వచ్చారు. అక్కడ అతని హావభావాలు, చొక్కాపై రక్తపు మరకలు చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం, అంత్యక్రియలు జరిగినప్పుడు అతని చరవాణి తీసుకుని కాల్ డేటా సేకరించారు. సీసీ పుటేజిల్లోనూ వీరు వచ్చినట్లు గుర్తించారు. హత్య చేసిన సత్యనారాయణ, అతనికి సహకరించిన శ్రీనును కొవ్వూరులోని మెరకవీధిలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్సైలు పి.రవీంద్రబాబు, బి.దుర్గాప్రసాద్, కేవీ రమణ, జి.సతీష్ లను డీఎస్పీ వర్మ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
[ 28-03-2024]
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు