పాడైన బండే పట్టించింది...
రాజానగరం మండలం ఆటోనగర్లో 540 కేజీల గంజాయిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
‘పుష్ప’ చిత్రం తరహాలో గంజాయి అక్రమ రవాణా
ఆటోనగర్ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు
రాజానగరం, న్యూస్టుడే: రాజానగరం మండలం ఆటోనగర్లో 540 కేజీల గంజాయిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప’ సినిమా తరహాలో సరకు రవాణా చేస్తుండగా వాహనం మరమ్మతులకు గురై విషయం బయటకొచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్కు పైన కూరగాయలు, అడుగున గంజాయితో వెళ్తున్న ఓ వ్యాన్ దివాన్చెరువు దాటాక ఆటోనగర్ వద్ద మరమ్మతుకు గురైంది. దాంతో సమీపంలోని ఆటోనగర్కు వాహనాన్ని తరలించారు. వ్యానులో గంజాయి ఉందన్న సమాచారంతో ఎన్సీబీ బృందం దాడి చేసింది. 540 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.37 లక్షలు ఉంటుందని అంచనా. వివరాల కోసం ప్రయత్నించగా ఎన్సీబీ బృందం అందుబాటులోకి రాలేదు.
రాజమహేంద్రవరం నేరవార్తలు: చింతపల్లి ఏజెన్సీ నుంచి దిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరు స్టేషన్ పోలీసులు అరెస్టు చేయడంతోపాటు 120 కేజీల సరకు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.ఏడున్నర లక్షలు ఉంటుందన్నారు. సీఐ రాయుడు విజయ్కుమార్ వివరాల మేరకు.. గ్రామీణం పరిధి నవభారత్నగర్లో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో బుధవారం దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన గెమ్మిలి నాగేశ్వరరావు, పెద్దగడ్డ వంగసార గ్రామానికి చెందిన సిందేరి రమేష్, విశాఖ జిల్లా కోటవురట్ల మండలం రాజులపాలెం ప్రాంతానికి చెందిన మొగిలి సూర్యనారాయణ, పుట్టపర్తి జిల్లా కొత్తచెరువు కమ్మపాల్యం వీధికి చెందిన ముత్తరాసి నరేష్, దిల్లీకి చెందిన టోనీ సచ్దేవ్ అలియాస్ దీపు, ప్రిన్స్ గిల్దియాల్ అలియాస్ ప్రిన్స్, అర్జున్ గోపాలస్వామిలను అరెస్టు చేశారు. వీరిలో నాగేశ్వరరావు, రమేష్ చింతపల్లి ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేసి రాజమహేంద్రవరంలోని సూర్యనారాయణ, నరేష్లకు అప్పగిస్తే దీపు, ప్రిన్స్, అర్జున్లు దాన్ని అక్రమంగా దిల్లీకి సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిందని సీఐ తెలిపారు. గంజాయితోపాటు రెండు వాహనాలు సీజ్ చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
[ 20-04-2024]
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు.. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
[ 20-04-2024]
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: పురందేశ్వరి
[ 20-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిసితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
నేడు కోరుకొండలో వారాహి విజయభేరి సభ
[ 20-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో శనివారం నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. -
పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
[ 20-04-2024]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. -
కొనసాగిన నామినేషన్ల సందడి
[ 20-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. -
వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!
[ 20-04-2024]
వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. -
రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 20-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం
[ 20-04-2024]
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
జగన్ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం
[ 20-04-2024]
ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. -
వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
[ 20-04-2024]
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. -
జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఇళ్లకు వెళ్లడం ఎలా?
[ 20-04-2024]
సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. -
సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM