సాంకేతిక పద్ధతిలో చెత్త సమస్యకు పరిష్కారం
సాంకేతిక పద్ధతిలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ కె.మాధవీలత అన్నారు.
చెత్తశుద్ధి కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ మాధవీలత
కొవ్వూరు పట్టణం: సాంకేతిక పద్ధతిలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. కొవ్వూరు పట్టణ పరిధి కాటన్ విగ్రహం సమీపంలో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను బుధవారం ఆమె పరిశీలించారు. చెత్తను శుద్ధి చేసే పనులను పర్యవేక్షించి గుత్తేదారులు, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తను శుద్ధి సిమెంటు కర్మాగారాలకు తరలిస్తారన్నారు. తరుణ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేసుకున్న ఒప్పందం మేరకు చెత్తను వేరు చేసే ప్రక్రియ సాగుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించేలా శ్రద్ధ చూపాలని కమిషనర్ బి.శ్రీకాంత్కు సూచించారు. చెత్త పూర్తిగా తొలగించిన తర్వాత ఈ ప్రదేశంలో మోడల్ పోలీస్స్టేషన్, సబ్ పోలీస్స్టేషన్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఏఈలు కిషోర్, సుమంత్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక రీచ్ల అనుమతులకు ఆదేశాలు
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇసుక రీచ్లకు అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే సమావేశం నాటికి జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇసుక రీచ్లకు అనుమతులు జారీ చేయాలన్నారు. కొవ్వూరు డివిజన్లో రెండు రీచ్లకు అనుమతి వచ్చిందన్నారు. జిల్లాలో గుర్తించిన 39 రీచ్లకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఏడు రీచ్లలో 82,548 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. గత సమావేశంలో నిర్ణయం మేరకు పందలపర్రు, జీడిగుంట, కుమారదేవం ఇసుక రీచ్లకు అనుమతులు ఇచ్చామన్నారు. కడియపులంకకు రీచ్కు సంబంధించి ఈసీ ప్రతిపాదనకు పంపించామన్నారు. గతంలో బోట్స్మ్యాన్ సొసైటీ ద్వారా ఆరు సొసైటీలు దరఖాస్తు చేసుకోగా అయిదింటికి అనుమతులు ఇచ్చామన్నారు. సమావేశంలో జేసీ తేజ్భరత్, ఆర్డీవో చైత్రవర్షిణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే
[ 29-03-2024]
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM