logo

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

భార్య కాపురానికి రాకుండా విడిపోయి దూరంగా ఉంటుందని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గోపాలపురం మండలంలో చోటు చేసుకుంది.

Published : 30 Mar 2023 05:26 IST

నాగేశ్వరరావు (పాత చిత్రం)

గోపాలపురం, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రాకుండా విడిపోయి దూరంగా ఉంటుందని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గోపాలపురం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన జుట్టా నాగేశ్వరరావు(33) ఇంటి నుంచి దుర్వాసన రావడంతో మంగళవారం రాత్రి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లి పరిశీలించగా నాగేశ్వరరావు ఇంట్లో ఇనుప రాడ్డుకు చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుడికి బేబి అనే మహిళతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. తొలుత ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. ఆ తర్వాత నాగేశ్వరరావు మద్యానికి బానిస అవ్వడంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. కొన్నిరోజులుగా విడివిడిగా ఉంటున్నారు. ఈనెల 26న భార్యకు ఫోను చేసి ఇంటికి తిరిగొచ్చేయమని, లేదంటే చనిపోతానని హెచ్చరించాడు. గతంలోను ఇదే మాదిరిగా సైతం బెదిరించడంతో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అదే రోజు ఉరేసుకుని ఉంటారని భావిస్తున్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని