వైకాపాలో భగ్గుమన్న విభేదాలు
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటివరకు ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ సమస్యలపై స్పందించడం లేదని వాకౌట్ చేయడం చూశాం...కానీ అమలాపురం పట్టణంలో అధికారపార్టీ మున్సిపల్ ఛైర్పర్సన్పై అధికారపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.
కమిషనర్ను నిలదీస్తున్న జనసేన కౌన్సిలర్లు
అమలాపురం పట్టణం: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటివరకు ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ సమస్యలపై స్పందించడం లేదని వాకౌట్ చేయడం చూశాం...కానీ అమలాపురం పట్టణంలో అధికారపార్టీ మున్సిపల్ ఛైర్పర్సన్పై అధికారపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. అమలాపురం పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఛైర్పర్సన్ సభను ప్రారంభిస్తూ తనకు తెలియకుండా మంత్రి విశ్వరూప్ పేరిట అభివృద్ధి కార్యక్రమాలంటూ అజెండాలో అంశాలు ప్రెవేశపెట్టడం ఏంటని కమిషనర్ అయ్యప్పనాయుడు, డీఈ అప్పలరాజులను ప్రశ్నించారు. డీఈఈ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో సీసీ కెమెరాలు ఛైర్పర్సన్ ఛాంబర్కు కనెక్ట్ చేయాలని 16 నెలలుగా అడుగుతున్నా ఎందుకు స్పందిచడం లేదని నిలదీశారు. దీనిపై వైకాపా పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, వైకాపా కౌన్సిలర్లు ఛైర్పర్సన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఛైర్పర్సన్ చేసిన మంత్రి విశ్వరూప్కు, పార్టీకి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అరుపులు కేకలు వేస్తూ వైకాపా కౌన్సిలర్లు అందరూ ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు.. తానేమి తప్పు మాట్లాడలేదని అయినా వైకాపా కౌన్సిలర్లు ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు పక్కనే ఉన్న డీఈ కార్యాలయంలోకి వెళ్లిపోగా మున్సిపల్ కమిషనర్ కూడా వెళ్లిపోతుండటంతో ఛైర్పర్సన్ అసహనం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ఒక గంట వాయిదా వేసి ఆమె ఛాంబర్లోకి వెళ్లిపోయారు.ఈ సందర్భంగా అజెండాలో 36 అంశాలను, సుమారు రూ.80లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్ సమావేశం ఆమోదించింది.
సమస్యలు ఏకరవు
పట్టణంలో విద్యుత్తు దీపాలు వెలగకపోతే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, చేసే అభివృద్ధి పనులకు అజెండాలో ప్రతిపక్ష కౌన్సిలర్ల పేర్లు ఎందుకు పెట్టడం లేదని మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఏడిద శ్రీను ప్రశ్నించారు. బోడసకుర్రు టిడ్కో భవనాలను పేదలకు అందించేలా చూడాలని అయిదో వార్డు తెదేపా కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు కోరారు.వార్డుల్లో చేస్తున్న అభివృద్ధి పనులకు కౌన్సిలర్లను సంప్రదించకుండా కేవలం మంత్రి పేరు మీదే అజెండాలో అంశాలను పొందు పరచడం ఏమిటని జనసేన, తెదేపా కౌన్సిలర్లు ప్రశ్నించారు. మహిళా ఛైర్పర్సన్ను వైైకాపా నాయకులు అవమానపరిచారన్నారు. జనసేన, తెదేపా కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
అయిపోయిన పనులకు అంచనాలా
1వ వార్డు చింతగుంట చెరువు వద్ద నిర్మాణం చేసిన భవనానికి మళ్లీ వివిధ అవసరాలకు అని పేరు చెప్పి భవనం నిర్మాణం చేసేందుకు రూ.4.30లక్షలు కేటాయించాలని అజెండాలో ఎందుకు పెట్టారని 21వ వార్డు తెదేపా కౌన్సిలర్ అబ్బిరెడ్డి చంటి నిలదీశారు. అంబేడ్కర్ విగ్రహ భవనం అని కాకుండా పేర్లు మార్చడం ఏంటని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక సంఘ పరిధిలో 150 మంది సిబ్బంది ఉన్నా పట్టణంలో అపరిశుభ్రం తాండవిస్తుందని 7వ వార్డు కౌన్సిలర్ గండి దేవిహారిక ఆరోపించారు.
ఈనాడు కథనానికి స్పందన
నల్లవంతెన బైపాస్రోడ్డు శ్మశానవాటికకు వెళ్లేదారిలో రూ.85లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినా మధ్యలో కరెంట్ స్తంభాలు తొలగించకుండానే రోడ్డేస్తున్నారని ఈనాడులో ఈ నెల 24వ తేదీన వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు రూ.5లక్షలతో మధ్యలో కరెంట్ స్తంభాలు తొలగించి చివరన వేసేటట్టు ఆమోదించారు. వైకాపా కౌన్సిలర్ సంసాని నాని మాట్లాడుతూ ఈనాడులో కథనం వచ్చేవరకు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ఛైర్మన్ నానిరాజు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశం మధ్యలో వెళ్లిపోతున్న వైకాపా కౌన్సిలర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే పథకాల అమలు
[ 18-04-2024]
సైకో పాలనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రానున్న రోజుల్లో కూటమి విజయం సాధించి ఎన్నోసంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చాగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య అన్నారు. -
యువకుని ఆత్మహత్య
[ 18-04-2024]
ఆత్రేయపురం మండలం, రాజవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. -
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు