వెంకన్న కల్యాణం చూతము రారండి..!
కోనసీమ తిరుపతిగా వెలుగొందుతున్న వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి తీర్థం, కల్యాణోత్సవాలు రేపటి నుంచి వారం రోజులు వైభవంగా జరగనున్నాయి.
ఉత్సవాలకు అంకురార్పణ రేపు
స్వర్ణ కవచంలో వేంకటేశ్వరుడు
కోనసీమ తిరుపతిగా వెలుగొందుతున్న వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి తీర్థం, కల్యాణోత్సవాలు రేపటి నుంచి వారం రోజులు వైభవంగా జరగనున్నాయి. శుక్రవారం ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. స్వామివారి రథోత్సవం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు, కల్యాణం రాత్రి 7 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ రుద్రరాజు రమేష్రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
న్యూస్టుడే, ఆత్రేయపురం
దైవభక్తి
కోరిన వారికి కొంగు బంగారమైన ఈ స్వామి దేశంలో ఎక్కడా లేనివిధంగా అరుదైన రక్తచందనం చెక్కతో ఈ దైవరూపం వెలిసింది. స్వామివారు అశ్వారూఢులై తిరుపతి నుంచి బయలుదేరి మార్గమధ్యలో ద్వారకా తిరుమలలో ఓ అంశనూ, ఈ వాడపల్లి క్షేత్రంలో మరో అంశనూ స్థాపించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆలయం వద్ద మాడ వీధుల్లో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షణాలు చొప్పున 49 ప్రదక్షణాలు చేసి స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శిస్తారు.
దేశభక్తి
1931 సంవత్సరం వాడపల్లి తీర్థం రోజున రథోత్సవం జరుగుతుండగా రథం మీద ఉంచిన గాంధీ చిత్రపటాన్ని, త్రివర్ణపతాకాన్ని బ్రిటిష్ పాలకులు తొలగించడంతో వారిని ఎదిరించినందుకు తుపాకీ¨ గుళ్లకు బలై పలువురు దేశభక్తులు అసువులు బాశారు. అందుకే ఇక్కడ రథోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకత నెలకొంది.
ఏర్పాట్లు
ఉత్సవాలకు వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం తదితర ఏర్పాట్లు చేశారు, ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
కార్యక్రమ వివరాలిలా..
* మార్చి 31: అంకురార్పణ, ధ్వజారోహణం
* ఏప్రిల్ 1: శనివారం ఎదుర్కోలు ఉత్సవం, రథోత్సవం, రాత్రి 7 గంటలకు కల్యాణం.
* 2న ఆదివారం శాంతిహోమం, గరుడ వాహనం, 3న పొన్నవాహన మహోత్సవం, 4న సదస్యం, 5న తెప్పోత్సవం
* 6న మహాపూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజావరోహణ
* 7న శ్రీపుష్పోత్సవం (పవళింపుసేవ)తో ఉత్సవాలు ముగుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు
[ 23-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. -
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
[ 23-04-2024]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు