logo

తెలుగు జాతి కీర్తి.. ఎన్టీఆర్‌

ప్రజా సంక్షేమం కోసమే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు.

Published : 30 Mar 2023 05:26 IST

\

రాజమహేంద్రవరం వేడుకల్లో తెదేపా నాయకులు

టి.నగర్‌(రాజమహేంద్రవరం): ప్రజా సంక్షేమం కోసమే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. అర్బన్‌ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పార్టీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. పార్టీ జెండా ఎగురవేసి, ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిందన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు, కాశీ నవీన్‌కుమార్‌, వర్రే శ్రీనివాసరావు, ద్వారా పార్వతి సుందరి పాల్గొన్నారు.

కొవ్వూరు పట్టణం: తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. కొవ్వూరులోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని