అమరావతి రథం... అరసవల్లి పథం
పాలకుల అణచివేతలు.. పోలీసుల నిర్బంధాలు.. లెక్కలేనన్ని కేసులు.. ఇవేవీ రాజధాని రైతులు లెక్కచేయలేదు.. ఎత్తిన జెండా దించలేదు.. ‘అమరావతే ఆంధ్రుల రాజధాని’ అంటూ ముందుకు ఉరికారు.
ఉద్యమానికి 1,200 రోజులు
నేడు రామచంద్రపురం నుంచి యాత్ర
రామచంద్రపురం: చోడవరంలో నిలిపిన రథం
ఈనాడు, కాకినాడ- రామచంద్రపురం: పాలకుల అణచివేతలు.. పోలీసుల నిర్బంధాలు.. లెక్కలేనన్ని కేసులు.. ఇవేవీ రాజధాని రైతులు లెక్కచేయలేదు.. ఎత్తిన జెండా దించలేదు.. ‘అమరావతే ఆంధ్రుల రాజధాని’ అంటూ ముందుకు ఉరికారు. అమరావతి ఉద్యమానికి నేటితో 1,200 రోజులు. ఈ నేపథ్యంలో 2.0గా ప్రారంభమైన యాత్ర కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రథంతో రైతులు శుక్రవారం బయలుదేరి ఏప్రిల్ 2న అరసవల్లి చేరుకుని స్వామి మొక్కుతీర్చుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటనతో.. అమరావతి రాజధాని సాధన ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. ప్రజల్లోకి తమ వాదన తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మహాపాదయాత్ర 2.0కు రూపకల్పన చేసిన రైతులు గతేడాది సెప్టెంబరు 12న అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించి.. సూర్యభగవానుడికి మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించారు. 40 రోజులపాటు సాగిన ఈ యాత్ర రామచంద్రపురంలో పోలీసుల అభ్యంతరంతో ఆగింది. దీంతో రైతులు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. యాత్ర వెంట సాగిన వెంకటేశుని దివ్యరథాన్ని రామచంద్రపురంలోనే నిలిపారు.
గతేడాది ఉమ్మడి జిల్లాలో సాగిన అమరావతి రైతుల యాత్ర
అడ్డంకులతో ఆగి.. సంకల్పంతో సాగి..
యాత్రపై అక్టోబరు 21న రామచంద్రపురంలో ప్రవేశించే సమయంలో రైతుల నిరసనలు.. పోలీసుల ప్రతిఘటనలతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో పలువురు రైతులు గాయపడ్డారు. ఆంక్షలు ఛేదించుకుని రామచంద్రపురం చేరుకున్నా.. ఆ మరుసటి రోజున బస ప్రాంగణం నుంచి ముందుకు కదల్లేని పరిస్థితి ఎదురయ్యింది. గుర్తింపు కార్డులు ఉన్నవారికే యాత్రకు అనుమతిస్తామని పోలీసులు ఆంక్షలు విధించడంతో గతేడాది అక్టోబరు 22న పాదయాత్రకు రైతులు తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. రామచంద్రపురంలో దివ్యరథాన్ని నిలిపి.. రైతులు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. తర్వాత రథానికి అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ హార్డ్ డిస్కులు పోలీసులు స్వాధీనం చేసుకోవడం.. విధులకు ఆటంకం కలిగించారన్న ఉద్దేశంతో అక్కడి భద్రత సిబ్బందిని పోలీసులు కొట్టడం అప్పట్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 2 నాటికి చేరేలా..
రామచంద్రపురంలో ఆగిన ‘అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర’ను పరిపూర్ణం చేయడానికి ఈ ఏడాది జనవరి 11న అమరావతి ఐకాస కోకన్వీనర్ గద్దె తిరుపతిరావు ఒంటరిగా నడక ప్రారంభించారు. రామచంద్రపురంలో పూజలు చేసి.. కాలినడకన అరసవల్లి చేరుకుని రైతుల తరఫున మొక్కు చెల్లించారు. ఆగిన రథాన్ని స్వామి సన్నిధికి చేరిస్తే తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఉద్దేశంతో అరసవల్లి తీసుకెళ్లి అక్కడ పూజలతో మొక్కు తీర్చుకుని యాత్ర ముగించాలని నిర్ణయానికి వచ్చారు. రైతులు, ఇతరులెవ్వరూ రథం వెంట రావద్దని.. ఏప్రిల్ 2 నాటికి నేరుగా అరసవల్లికే చేరుకోవాలని రాజధాని రైతులు విన్నవించిన విషయం తెలిసిందే. రామచంద్రపురం మండలం చోడవరం గ్రామంలో నిలిపిన వెంకటేశుని దివ్య రథాన్ని శుక్రవారం పూజల అనంతరం ఆర్భాటాలు లేకుండా అరసవల్లి తరలించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బరిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..