126 కేంద్రాల్లో పది పరీక్షలు
పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం చెప్పారు.
న్యూస్టుడే, శ్యామలాసెంటర్
పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు రాసేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్నారు. పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది కొత్తగా పలు కీలక మార్పులు జరిగాయన్నారు. ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో ఆయన పలు అంశాలు వెల్లడించారు.
కోడ్తో కట్టడి..
ఈసారి ప్రశ్నపత్రంపైనా కోడ్ అమలు చేస్తున్నాం. దీనివల్ల ప్రశ్నపత్రం లీక్ కావడం వంటివి చోటుచేసుకునే అవకాశం లేదు. ఒకవేళ లీకైనా ఏ జిల్లా, ఏ పరీక్ష కేంద్రం నుంచి లీకైందో క్షణాల్లో తెలిసిపోతుంది. విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా ఉండేందుకు ఈ పద్ధతిని తొలిసారి ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతోపాటు విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ను ఇస్తారు.
చరవాణి అనుమతిలేదు..
పదో తరగతి పరీక్షలు సజావుగా జరిపేందుకు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్)కు మాత్రమే గతంలో చరవాణి(సెల్ఫోన్) అనుమతి ఉండేది. ఈసారి సీఎస్కు కూడా అనుమతి లేదు. దీంతోపాటు ఇన్విజిలేటర్కు కూడా చరవాణి అనుమతిలేదు.
అరగంట ముందు మాత్రమే ప్రశ్నపత్రం
పదోతరగతి ప్రశ్నపత్రాలను ఇప్పటికే జిల్లాలోని మండల కేంద్రాలు, పోలీసు స్టేషన్లకు చేరాయి. పరీక్షకు 30 నిమిషాల ముందు మాత్రమే వాటిని ఆయా మండల కేంద్రాల నుంచి పోలీసు బందోబస్తు నడుమ కేంద్రానికి తరలిస్తారు.
అయిదు సమస్యాత్మక కేంద్రాలు
జిల్లాలో అయిదు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. ‘సి’ కేటగిరీ కేంద్రాలు 28 ఉన్నాయి. వీటికి ఒక్కో సెంటర్కు ఒక్కో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశాం. ఇందులో ఏఎస్సై, డిప్యూటీ తహసీల్దారు, ఎంఈఓ ఉంటారు. 126 చోట్లా 11 మంది ఇన్విజిలేటర్లు, ఒక సీఎస్, ఒక ప్రభుత్వ అధికారిని నియమించాం.
సౌకర్యాలున్నచోటే నిర్వహణ
జిల్లాలో 492 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో కేవలం 126 కేంద్రాలుగా మాత్రమే గుర్తించి అక్కడ పరీక్షలు నిర్వహిస్తాం. నాడు-నేడు పనులు జరిగే పాఠశాలలను కేంద్రాలుగా కేటాయించలేదు.
ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా సౌకర్యాలు ఉన్న కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నాం.
ఈసారి 26,129 మంది విద్యార్థులు
జిల్లాలో 126 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 26,129 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా... వీరిలో బాలురు 13,518, బాలికలు 12,611 మంది ఉన్నారు.
భయం వద్దు.. జయం మీదే
విద్యార్థులూ పరీక్షలకు ముందు రోజు వరకు పాఠశాలకు వెళ్లండి. ఉపాధ్యాయులు చెప్పే చిన్న చిన్న చిట్కాలు వినండి. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి పది ఉత్తీర్ణత సాధించేందుకు వారం వారం గ్రాండ్ టెస్ట్, స్లిప్ టెస్ట్లు పెట్టాం. నాలుగు నెలల కిందట చదివిన ప్రశ్నలే పబ్లిక్ పరీక్షల్లో వస్తాయి. భయపడకుండా రాయండి. ఈసారి పదో తరగతి సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా చూస్తే ఫలితాలు 80 నుంచి 90 శాతం మధ్యలో వచ్చాయి. ఆ స్థాయిలోనే జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఉంటుంది.
తల్లిదండ్రులూ.. ఇది మీ బాధ్యత
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి. వారు చదువుతున్నంత సేపు ఇంట్లో టీవీలు, సినిమాలకు విరామం ప్రకటించండి. పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వండి. పరీక్షలకు రెండు రోజులు ముందుగా కేంద్రానికి వెళ్లి ఒక్కసారి వాతావరణాన్ని పరిశీలించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
[ 23-04-2024]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా