బటన్ నొక్కినా.. బ్యాంకులో పడలేదు..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్నొక్కి ఆరు రోజులు గడుస్తున్నా.. ఎన్నికల హామీ నెరవేర్చామని చెబుతూ లబ్ధిదారుల ఇళ్లకు అతికించేందుకు సీఎం బొమ్మతో స్టిక్కర్లు కార్యాలయాలకు చేరినా.. ఆసరా మూడో విడత రుణమాఫీ సొమ్ము మాత్రం జిల్లాలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు జమ కాలేదు.
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
సీఎం బొమ్మతో ఉన్న ఆసరా మూడో విడత స్టిక్కరు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్నొక్కి ఆరు రోజులు గడుస్తున్నా.. ఎన్నికల హామీ నెరవేర్చామని చెబుతూ లబ్ధిదారుల ఇళ్లకు అతికించేందుకు సీఎం బొమ్మతో స్టిక్కర్లు కార్యాలయాలకు చేరినా.. ఆసరా మూడో విడత రుణమాఫీ సొమ్ము మాత్రం జిల్లాలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు జమ కాలేదు. రుణమాఫీ లబ్ధిపొందిన ప్రతి మహిళ ఇంటికి స్టిక్కర్ వేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటిని ఆయా మండల సమాఖ్యలకు పంపించి, అక్కడి నుంచి గ్రామాలకు వీవోఏల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే మూడో విడత ఆసరా సాయం విడుదల నాలుగు నెలల ఆలస్యమైంది. కాకినాడ జిల్లాలో కేవలం ఒక మండలం పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు ఆసరా సొమ్ము బుధవారం జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లాలోని 37,525 డ్వాక్రా సంఘాలకు రూ.303.96 కోట్లు ఆసరా మూడో విడత కింద మంజూరు చేశారు. పెదపూడి మండలం మినహా మిగతా మండలాల్లోని సంఘాలకు ఎప్పటికి జమ చేస్తారో స్పష్టత లేదు.
కాకినాడ డీఆర్డీఏ కార్యాలయంలో మండలాలకు తరలించడానికి సిద్ధం చేసిన ఆసరా స్టిక్కర్లు
ఇదీ పరిస్థితి..
* కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 4,063 డ్వాక్రా సంఘాలకు రూ.28.08 కోట్ల ఆసరా సొమ్ము మంజూరు చేశారు. ఈ నెల 26 నుంచి వరుసగా ఆసరా సంబరాలను ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. నాలుగు, అయిదు డివిజన్లకు ఒకచోట పెద్ద సభ పెట్టి మెగా చెక్కులు అందజేస్తున్నారు. సంబరాలు పూర్తయిన డివిజన్లలోని సభ్యులకు ఇప్పటికీ ఆసరా సొమ్ము ఖాతాలకు జమ కాలేదు. ఒక్కోచోట రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసిన ఆసరా సంబరాలు అట్టహాసంగా చేస్తున్నారు.
* తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లోనూ ఇదే తంతు. వీటిలో 4,703 డ్వాక్రా సంఘాలకు రూ.38.35 కోట్ల ఆసరా మూడో విడత రుణమాఫీ సాయం మంజూరు చేశారు. ఇక్కడా ఆసరా సంబరాలు జరుగుతున్నాయి.
సంబరాలు జరపండి... సొమ్ములేస్తాం..
గతేడాది నుంచి వైఎస్సార్ ఆసరా పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెడుతోంది. రుణమాఫీకి సంబంధించి ఆసరా సంబరాలను వారం రోజులపాటు నిర్వహించాలని, ఏ రోజు ఏ మండలంలో ఇవి నిర్వహించారో అక్కడి డ్వాక్రా సంఘాలకు తరవాత రోజు మహిళల బ్యాంకు ఖాతాకు సొమ్ము జమ చేస్తామని చెబుతోంది. ఈ ఏడాది సైతం ఇదే పంథాను అనుసరిస్తోంది. ఈ నెల 25న సీఎం జగన్మోహన్రెడ్డి ఆసరా మూడో విడత విడుదలకు బటన్ నొక్కారు. 26 నుంచి ఏప్రిల్ 4 వరకు అన్ని మండలాల్లో ఆసరా సంబరాలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం 26న పెద్దాపురం, 27న పెదపూడి, గండేపల్లి, 28న రౌతులపూడి, పిఠాపురం, కిర్లంపూడి, 29న కరప, శంఖవరంలో సంబరాలు జరిపారు. వీటిలో ఒక మండలానికి చెందిన డ్వాక్రా మహిళలకు సొమ్ము వేశారు. ఈ నెల 31న జగ్గంపేట, ప్రత్తిపాడు, సామర్లకోట, యు.కొత్తపల్లి, తొండంగి, కాకినాడ గ్రామీణం, 1న తాళ్లరేవు, 2న కాజులూరు, 3న గొల్లప్రోలు, తుని, 4న కోటనందూరు మండలాల్లో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ మండలాల్లోని డ్వాక్రా మహిళలకు ఎప్పటికి సొమ్ము జమ చేస్తారనేది వేచి చూడాలి.
దశల వారీగా జమ
జిల్లాలోని డ్వాక్రా సంఘాల సభ్యుల బ్యాంకు ఖాతాలకు ఆసరా మూడో విడత సొమ్ము దశల వారీగా విడుదల చేస్తారు. ఏ మండలంలో ఆసరా సంబరాలు పూర్తి చేస్తారో ఆ రోజు సాయంత్రం వివరాలను సమర్పిస్తారు. దాని ప్రకారం ఆయా బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళల ఖాతాలకు సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక మండలంలో ఇప్పటికే సొమ్ము వేశారు. గురువారమూ బ్యాంకులు పనిచేశాయి. మరికొంత మందికి వీటిని జమ చేసేలా ఏర్పాట్లు చేశాం. వీలైనంత త్వరగా అన్ని సంఘాలకు సొమ్ము వేసేలా చర్యలు తీసుకుంటాం.
ప్రసాద్, ఎల్డీఎం, కాకినాడ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!