పంచాయతీల్లో సంపద సృష్టికి ప్రాధాన్యం
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్.విక్టర్ తెలిపారు.
న్యూస్టుడే, కాకినాడ నగరం
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్.విక్టర్ తెలిపారు. గ్రామాల్లో వీధి కుక్కల సంతానోత్పత్తిని నియంత్రించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. గ్రామాల్లో పేరుకుపోయిన ఇంటి పన్నుల వసూళ్లపై చర్యలు తీసుకునేలా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చామని వివరించారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై ఆయనతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి వివరాలివీ..
న్యూస్టుడే: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల పని తీరు ఎలా ఉంది.
డీపీవో: జిల్లాలో 385 పంచాయతీలకు గాను 277 చోట్ల చెత్త నుంచి సంపద కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ చెత్త నుంచి ఎరువులు తయారు చేసి కేజీ రూ.10కు విక్రయిస్తున్నారు. కొత్తగా మరో 92 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
జిల్లాలో పంచాయతీలపై విద్యుత్తు బిల్లుల భారమెంత.
ఇప్పటి వరకు జిల్లాలో పంచాయతీల విద్యుత్తు బిల్లుల కింద రూ.99.87 కోట్లు ఆర్థిక సంఘం నిధులు చెల్లించాం. మరో రూ.51.97కోట్లు చెల్లించాల్సి ఉంది.
గ్రామాల్లోని చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి సైతం ప్రజలు జిల్లా కేంద్రానికి రావటానికి కారణాలేంటి.
ఇది మా దృష్టికి వచ్చింది. అందుకే గ్రామ స్థాయిలోనే స్పందన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. సచివాలయాల్లో స్పందనకు వచ్చే స్థానిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించాం. ఇకపై ఈ సమస్యల పరిష్కారానికి ప్రతివారం సమీక్ష నిర్వహిస్తాం.
జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల తీరు ఎలా ఉంది. మొండి బకాయిలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.59.74 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.33.95 కోట్లు వసూలు చేశాం. మరో రూ.13.65 కోట్ల పన్నులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పి.మల్లవరం (తాళ్లరేవు మండలం)లోనే రూ.11 కోట్ల వరకు ఉన్నాయి. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకుంటాం. మూడేళ్లు దాటిన బకాయిలపైనే కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది.
ఆర్థిక సంఘం నిధుల విడుదల, వినియోగం తీరు ఎలా ఉంది.
ఉమ్మడి జిల్లాలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.948.65 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో ఇంకా రూ.1.61 కోట్లు ఖర్చు కాలేదు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి కాకినాడ జిల్లాకు రూ.126.86 కోట్లు విడుదలయ్యాయి. వీటిని వినియోగించుకుని పంచాయతీల్లో పనులు చేసుకోవచ్చు.
గ్రామాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయనే ఫిర్యాదులున్నాయి. అనేక మంది కుక్క కాట్లకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేస్తున్నారు.
గ్రామాల్లో ప్రతి శని, ఆదివారాల్లో కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయాలని ఆదేశించాం. ఇందుకు ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలని సూచించారు.
పంచాయతీల్లో కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని ఎలా అధిగమిస్తున్నారు.
కొన్నిచోట్ల కార్యదర్శులు లేనిమాట వాస్తవమే. అటువంటి వాటిని గుర్తించి పక్క పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించాం. ఆయా పంచాయతీలపై డీఎల్పీవోలు, ఈవోఆర్డీలు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
[ 20-04-2024]
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు.. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
[ 20-04-2024]
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: పురందేశ్వరి
[ 20-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిసితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
నేడు కోరుకొండలో వారాహి విజయభేరి సభ
[ 20-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో శనివారం నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. -
పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
[ 20-04-2024]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. -
కొనసాగిన నామినేషన్ల సందడి
[ 20-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. -
వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!
[ 20-04-2024]
వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. -
రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 20-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం
[ 20-04-2024]
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
జగన్ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం
[ 20-04-2024]
ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. -
వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
[ 20-04-2024]
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. -
జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఇళ్లకు వెళ్లడం ఎలా?
[ 20-04-2024]
సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. -
సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.