కదిలింది.. దివ్య రథం
ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి నినాదంతో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర-2.0 పరిపూర్ణమయ్యే ఘడియలు ఆసన్నమయ్యాయి.
ఈనాడు, కాకినాడ - న్యూస్టుడే,
రామచంద్రపురం: ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి నినాదంతో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర-2.0 పరిపూర్ణమయ్యే ఘడియలు ఆసన్నమయ్యాయి. ‘అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర’ పోలీసుల ఆంక్షలతో గతేడాది అక్టోబరు 22న రామచంద్రపురంలో నిలిచిన సంగతి తెలిసిందే. అరసవల్లి వెళ్లి సూర్య భగవానుడి సన్నిధిలో మొక్కు తీర్చుకునే సంకల్పంతో శుక్రవారం వేకువన అమరావతి నుంచి బయల్దేరిన రైతులు ఉదయాన్నే రామచంద్రపురం చేరుకున్నారు. చోడవరంలో నెలలుగా నిలిచిన రథాన్ని బయటకు తీసి శుభ్రం చేసి.. స్వామివారికి అలంకరణల అనంతరం.. శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అరసవల్లి పర్యటనకు ఆటంకాలు కలగకూడదని కోరుకుంటూ గుమ్మడికాయతో దిష్టి తీసిన అనంతరం ఉదయం 9.30 గంటలకు ఎలాంటి ఆర్భాటం లేకుండా రథాన్ని తరలించారు. అమరావతి నుంచి వచ్చిన పది మంది రైతులు రథం ముందు కొంత దూరం నడుస్తూ.. జై అమరావతి.. జైజై అమరావతి.. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు.. అని నినాదాలు చేశారు. రాజధాని రైతులకు రామచంద్రపురం తెదేపా పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్, కొసన శ్రీనివాసరావు తదితరులు సంఘీభావం తెలిపారు.
నిరాడంబరంగా...
చోడవరంలో రథానికి గుమ్మడి కాయతో దిష్టి తీస్తున్న అమరావతి రైతు (అంతరచిత్రంలో స్వామి)
అరసవల్లి మొక్కు తీర్చుకోవడానికి గత ఏడాది రైతులు అమరావతి నుంచి బయల్దేరి.. చిన్న తిరుపతిలో పూజలు చేసి.. ఆపై అరసవల్లి చేరుకుని మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో పాదయాత్ర జనసంద్రం నడుమ సాగితే.. యాత్ర వెంట సాగిన స్వామి దివ్యరథం అడుగడుగునా పూజలందుకుంది. శుక్రవారం రామచంద్రపురం నుంచి బయలుదేరిన వెంకటేశుని దివ్య రథం నిరాడంబరంగా కదిలింది. రామచంద్రపురం మండలం చోడవరం నుంచి బయలుదేరిన రథం వేలంగి మీదుగా కాకినాడ గ్రామీణం- నగరంలోకి ప్రవేశించింది. అన్నమ్మఘాటీ- నర్సింహరోడ్డు- గాంధీనగర్ మీదుగా.. అచ్యుతాపురం రైల్వే గేటు మార్గంలోకి వచ్చింది. అక్కడ రైలు రాకతో గేటు వేయడంతో కాసేపు రథాన్ని నిలిపారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అశోక్నగర్, ఎస్వీరంగారావు కూడలి, సర్పవరం జంక్షన్ మీదుగా పిఠాపురం రోడ్డులోకి జాతీయ రహదారి గుండా అరసవల్లికి సాగింది.
పోలీసుల ఆరా...
రామచంద్రపురం నుంచి బయలుదేరి అమరావతి రైతుల రథం కదలికలపై పోలీసులు, నిఘావర్గాలు దృష్టిసారించాయి. జగన్నాథపురం నర్సింహరోడ్డులో పోలీసులు రథం వద్దకు వచ్చి ఆరా తీశారు. చరవాణితో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. రథం వెంట అమరావతి రైతులు, జనసందోహం లేకపోవడంతో ఎక్కడా నిలువరించలేదు. అమరావతి రైతుల రథాన్ని చూసి మార్గమధ్యంలో స్థానికులు ఆపి పూజలు చేసి స్వామి ఆశీస్సులు పొందారు.
వెంకటేశుని రథం ముందు ఆంధ్రుల రాజధాని అమరావతి అని నినదిస్తున్న రైతులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..