పక్కా ప్రణాళికతో పది పరీక్షల నిర్వహణ
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో చరవాణులను నిషేధించటంతో పాటు ఎలాంటి మాల్ప్రాక్టీస్కు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.
న్యూస్టుడే, అంబాజీపేట
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో చరవాణులను నిషేధించటంతో పాటు ఎలాంటి మాల్ప్రాక్టీస్కు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉమ్మడి జిల్లా పరీక్షల నిర్వహణ సంస్థ కార్యదర్శి బీర హనుమంతరావు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి ఆర్జేడీ నాగమణి పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖాధికారి కమలకుమారి, పరీక్షల నిర్వహణ సహాయ కమిషనర్ బి.రమణశ్రీ నేతృత్వంలో ఏర్పాట్లు చేశామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆయన శుక్రవారం ‘న్యూస్టుడే’ తో ముఖాముఖి మాట్లాడారు.
119 పరీక్ష కేంద్రాలు
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 374 ఉన్నాయి.ఆ పాఠశాలల నుంచి 20,968 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 19,084 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా....ప్రైవేట్గా 1883 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.బాలురు 10,869, బాలికలు 10,099 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు వచ్చే విద్యార్థులు సకాలంలో హాజరుకావాలి.
చరవాణులు నిషేధం
పది పరీక్ష కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి వద్ద చరవాణులు ఉండకూడదు.ఇది పూర్తిగా నిషేధించాం.కనీసం డిపార్టుమెంటల్ అధికారి వద్ద కూడా ఉండకూడదు.పరీక్షల పర్యవేక్షణకు నిరంతరం స్క్వాడ్స్ పరిశీలన ఉంటుంది. ఇప్పటికే ఇన్విజిలేటర్లకు మార్గదర్శకాలు ఇచ్చేశాం. 1,092 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 6, సిట్టింగ్ స్క్వాడ్స్ 35 మందిని నియమించారు.
కంట్రోలు రూమ్కు ఫిర్యాదు చేయాలి
పదో తరగతి పరీక్షలకు సంబంధించిన వివిధ సమస్యలపై కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయవచ్చు.దీని కోసం 8886750777, 9493819102 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయవచ్చు.
అన్ని సౌకర్యాలు ఏర్పాటు
పది పరీక్ష కేంద్రాల్లో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సౌకర్యాలను ఏర్పాటు చేశారు.పరీక్షలు ముగిసే వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం.పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. విద్యార్థులు పదో తరగతి హాల్ టిక్కెట్టును చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్యలోపాలు లేకుండా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో వెలుతురు, బల్లలు, ఫ్యాన్లు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద 114 సెక్షన్ అమలులో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?