నేర వార్తలు
దొంగలపై పోలీసులు నిత్యం నిఘా పెడుతున్నా చోరీలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పోలీస్స్టేషన్ పరిధిలో తాజాగా జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆర్టీసీ బస్సులో భారీ చోరీ
850 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు మాయం
పెనుగొండ: దొంగలపై పోలీసులు నిత్యం నిఘా పెడుతున్నా చోరీలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పోలీస్స్టేషన్ పరిధిలో తాజాగా జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సులో సుమారు రూ.40 లక్షలు విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై వస్తువులు పోగొట్టుకున్న బంగారం వ్యాపారి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు ఈ నెల 28న కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరుకు చెందిన ఒక బంగారు వ్యాపారి రాజమహేంద్రవరంలో ఉంటున్న తన గుమస్తాకు కొన్ని బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ను ఇచ్చి పాలకొల్లు పంపించారు. సదరు గుమస్తా పాలకొల్లు, నరసాపురంలో పని ముగించుకుని, 850 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును బ్యాగ్లో పెట్టుకుని ఈ నెల 27 సాయంత్రం పాలకొల్లులో రాజమహేంద్రవరం వెళ్లే బస్సు ఎక్కాడు. పెనుగొండ గ్రామంలో సిద్ధాంతం రోడ్డుకు చేరుకున్న తర్వాత ఆభరణాల బ్యాగ్ మాయమైనట్లు గుర్తించాడు. దీంతో అదే రోజు అర్ధరాత్రి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ భారీ చోరీని పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో 8 బృందాలతో దొంగల కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే కొంత వరకు ఆధారాలు లభించాయని, త్వరలోనే కేసును ఛేదిస్తామని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు.
ఉద్యోగాల పేరుతో బురిడీ
మండపేట: ఉద్యోగాల పేరుతో ముగ్గురు వ్యక్తులు మోసానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వ్యక్తితో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన భార్యాభర్తలు రైల్వేలో ఉగ్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేసినట్లు తెలిసింది. డాక్టరు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన యువతి సుమారు రూ.7 లక్షలు చెల్లించారు. కొందరిని నకిలీ ఐడీ కార్డులతో దిల్లీకి తీసుకెళ్లడంతో మోసపోయినట్లు తెలిసి నగదు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో కొంత మొత్తం బాధితులకు చెల్లించినట్లు తెలుస్తోంది. మండపేటకు చెందిన యువతి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఎస్సై ఎం.అశోక్ను వివరణ కోరగా బాధిత యువతి నుంచి రెండు రోజుల క్రితం ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఆమె చెప్పిన వ్యక్తులకు ఫోను చేసి మాట్లాడేందుకు రావాలని సమాచారం ఇచ్చామన్నారు. మరిన్ని వివరాలు సేకరించి ఆధారాలు ధ్రువీకరించిన తరువాత కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
నకిలీ మందుల విక్రేతకు జైలు
రాజమహేంద్రవరం వైద్యం: ఓ సంస్థ పేరిట నకిలీ మందులు తయారు చేసి హోల్సేల్ దుకాణాల్లో విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరంలోని ఒకటో అదనపు అసిస్టెంట్ సెషన్సు కోర్టు జడ్జి ఎస్.ప్రవీణ్కుమార్ తీర్పునిచ్చారని ఔషధ తనిఖీ అధికారి ఎ.కృష్ణ శుక్రవారం తెలిపారు. విజయవాడకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడ హానెస్ట్ ఫార్ములేషన్ సంస్థ పెట్టి నాసిరకం మందులు తయారు చేయడంతోపాటు శ్రీసత్యనారాయణ ఎంటర్ప్రైజస్ అనే హోల్సేల్ దుకాణం పేరుతో రాజమహేంద్రవరంలోని పలుచోట్ల విక్రయించేవారు. ఆ మందులపై 2016లో అప్పటి ఔషధ తనిఖీ అధికారి చంద్రరావు పరిశీలనలు చేయడంతోపాటు నమూనాలు పరీక్షించడంతో నకిలీవని తేలాయి. దాంతో కేసు నమోదు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారన్నారు.
తల్లడిల్లిన ‘తల్లిగుండె’
తుని గ్రామీణం: తన బిడ్డ ఆరోగ్యం కుదుటపడటం లేదని మనస్తాపానికి గురైన ఓ తల్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన తుని మండలం రాజుపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన గింజాల లోవతల్లి (20)కి అదే ఊరికి చెందిన కామరాజుతో వివాహమైంది. వీరికి ఏడాది కిందట కుమారుడు జన్మించాడు. బిడ్డ గుండెకు రంధ్రాలు ఉండటంతో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుట పడటం లేదని ఆ తల్లి తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బాలాజీ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. లోవతల్లి మృతితో భర్త, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బిడ్డను ఎలా పెంచాలని రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
[ 20-04-2024]
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు.. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
[ 20-04-2024]
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: పురందేశ్వరి
[ 20-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిసితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
నేడు కోరుకొండలో వారాహి విజయభేరి సభ
[ 20-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో శనివారం నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. -
పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
[ 20-04-2024]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. -
కొనసాగిన నామినేషన్ల సందడి
[ 20-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. -
వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!
[ 20-04-2024]
వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. -
రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 20-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం
[ 20-04-2024]
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
జగన్ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం
[ 20-04-2024]
ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. -
వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
[ 20-04-2024]
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. -
జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఇళ్లకు వెళ్లడం ఎలా?
[ 20-04-2024]
సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. -
సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.