మహా శోభ
తెదేపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న మహానాడుకు రాజమహేంద్రవరం ముస్తాబయ్యింది. 26న (శుక్రవారం) పొలిట్బ్యూరో సమావేశం, 27న ప్రతినిధుల సభ, 28న బహిరంగ సభ ఉండటంతో అగ్రనేతలంతా చేరుకుంటున్నారు.
పసుపు పండగకు సమాయత్తమైన నగరం
ఈనాడు, రాజమహేంద్రవరం: తెదేపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న మహానాడుకు రాజమహేంద్రవరం ముస్తాబయ్యింది. 26న (శుక్రవారం) పొలిట్బ్యూరో సమావేశం, 27న ప్రతినిధుల సభ, 28న బహిరంగ సభ ఉండటంతో అగ్రనేతలంతా చేరుకుంటున్నారు. మహానాడు జరిగే వేమగిరి వద్ద ఏర్పాట్లను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కీలక నాయకులంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రాంగణాలన్నీ పసుపు తోరణాలు, అలంకరణలతో కళకళలాడుతున్నాయి. సభా వేదికల నిర్మాణం పూర్తవడంతో తిలకించేందుకు స్థానికులు తరలివస్తున్నారు. ప్లీనరీలో 15 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అధిక ఉష్ణోగ్రతల రీత్యా అన్ని గ్యాలరీల్లోనూ కూలర్లు సమకూర్చారు. ప్రాంగణ వేదిక వద్దకు ఎన్టీఆర్ విగ్రహాన్ని తరలించారు. శనివారం ఉదయం నుంచే ప్రతినిధుల సభ్యత్వ నమోదు ఆరంభమవుతుంది. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్ తదితరులు నివాళి అర్పించిన తరువాత ప్లీనరీ ప్రారంభమవుతుంది. అదే ప్రాంగణంలో డిజిటల్ ఫొటో ప్రదర్శన, రక్తదాన, వైద్య శిబిరాలు, భోజన ఏర్పాట్లు జరగనున్నాయి.
చంద్రబాబు రాక నేడు
తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. అనంతరం స్థానిక మంజీర సరోవర్ హోటల్లో పొలిట్బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా శుక్రవారం చేరుకుంటారు. సమావేశం అనంతరం రాత్రి 8 గంటలకు వేమగిరి వద్ద ప్లీనరీ ప్రాంగణంలోనే బస చేయనున్నారు.
నగరం.. శోభాయమానం
గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు. సభా వేదిక, వసతి, భోజనాలు, సుందరీకరణ తదితర ఏర్పాట్లను మాజీ మంత్రులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, జవహర్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నాయకులు గన్ని కృష్ణ, వాసు, వేణుగోపాలరాయుడు, నవీన్ పరిశీలిస్తున్నారు. పార్టీ ముఖ్యనాయకులు చిట్టిబాబు, పట్టాభి తదితరులు వివిధ విభాగాల సమన్వయ బాధ్యతలు చేపడుతున్నారు. వేమగిరి నుంచి లాలా చెరువు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా భారీ కటౌట్లు, ప్లెక్సీలు, తోరణాలు ఏర్పాటుచేశారు. 28న జరిగే బహిరంగ సభ వేదిక పనులు శుక్రవారం సాయంత్రానికి పూర్తవుతాయని తెలిపారు.
బందోబస్తు కోసం ఎస్పీకి వినతి
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): మహానాడు వేళ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్, పోలీసు బందోబస్తు అంశాలపై గురువారం తెదేపా నాయకులు జిల్లా ఎస్పీ సుధీర్కుమార్రెడ్డిని కలిసి విన్నవించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ ట్రాఫిక్ను ఏవిధంగా మళ్లిస్తే బాగుంటుందో వివరించామన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడుంటారు... ఏయే ప్రాంతాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నదీ తెలిపామన్నారు. ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి రాజమహేంద్రవరానికి వచ్చే వారికి ఎక్కడికక్కడ భోజనాలు పెట్టి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రజలు కూడా సిద్ధమవుతున్నారన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ తెదేపా బ్యానర్లపై మరో పార్టీ బ్యానర్లు కట్టడం దారుణమన్నారు. ప్రజలు గో బ్యాక్ జగన్ అంటున్నారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, కార్యదర్శులు వాసిరెడ్డి రాంబాబు, కాశీ నవీన్కుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్