ఉపాధ్యాయ బదిలీలకు 8,025 దరఖాస్తులు
ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుందా? అన్న అనుమానం ఉపాధ్యాయ వర్గాల్లో బలపడుతోంది. గత డిసెంబరులో బదిలీ దరఖాస్తులు ఆహ్వానించారు.
పామర్రు, న్యూస్టుడే: ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుందా? అన్న అనుమానం ఉపాధ్యాయ వర్గాల్లో బలపడుతోంది. గత డిసెంబరులో బదిలీ దరఖాస్తులు ఆహ్వానించారు. నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ చాలామంది కోర్టును ఆశ్రయించడం, తీర్పులు రాకపోవడం, పరీక్షలు దగ్గర పడడంతో అప్పట్లో బదిలీలు నిలిచిపోయాయి. వేసవి సెలవుల్లో స్థానచలనం చేద్దామని ప్రభుత్వం దృఢంగా సంకల్పించుకుంది. కోర్టు వివాదాల్లో ఉన్న జీవోలను ఉపసంహరించుకుని కొత్తగా ప్రక్రియ ప్రారంభిస్తామని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కొత్తగా ఈసారి జీవో 47 ఇచ్చి బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నాటికి ఉపాధ్యాయులందరూ కొత్త స్థానాల్లో చేరేలా షెడ్యూలు ఇచ్చింది. మొదటి ఘట్టంలో భాగంగా మూడు రోజులు దరఖాస్తులు తీసుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి బదిలీలు కోరుతూ 8,025 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు.
గందరగోళం
* దరఖాస్తుల్లో వివిధ కేడర్లకు సంబంధించి పాయింట్లు నమోదు చేయడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి పాయింట్లు వర్తిస్తాయని, ఇంకోసారి వర్తించవని ఇలా.. వాట్సాప్ సందేశాలు రావడంతో ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. ఎవరికి తోచిన పాయింట్లు వారు వేసుకోవడం, తరువాత ఆ దరఖాస్తులను ఎంఈవో లాగిన్లో తొలగించడం, మళ్లీ దరఖాస్తు చేయడం వంటివి జరిగాయి.
* హేతుబద్ధీకరణ పాయింట్ల విషయంలో ప్రభుత్వం నుంచి పలుమార్లు వివరణలు రావడంతో దరఖాస్తుదారులు అసహనానికి గురయ్యారు. పాత, కొత్త స్టేషన్ పాయింట్ల నమోదులో కొందరు రెండు స్టేషన్ పాయింట్లు నమోదు చేశారు. కొందరు పాతవి, కొందరు కొత్తవి వేశారు. స్పౌస్కి సంబంధించి సందేహాల నడుమ పలుచోట్ల వివిధ రకాలుగా దరఖాస్తుల్లో నమోదులు జరిగాయి.
* 2013 నవంబరు 1న విధుల్లో చేరిన వారికి 8 సంవత్సరాలు పూర్తి కాకపోయినా నిర్బంధ బదిలీలు చేస్తున్నారు. 8 సంవత్సరాలు నిండిన వారికి వచ్చే పాయింట్లు వీరికి రావడం లేదని వాపోతున్నారు. దీన్ని సవరించాలని ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేశారు.
* బదిలీలు, పదోన్నతులు కూడా సమాంతరంగా నిర్వహిస్తుండడం గందరగోళంగా మారుతోంది. స్థానాలు తెలియకుండానే అంగీకారం, అంగీకారం తెలపకపోవడం అంటూ ఆదేశాలు రావడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ఖాళీలను బట్టి పదోన్నతి తీసుకుంటాం కానీ ముందే ఎలా చెప్పగలుగుతామని ప్రశ్నిస్తున్నారు.
* తప్పుల తడకల నిర్ణయాలతో పలువురు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. జూన్ 1న హైకోర్టు వెకేషన్ బెంచ్ సర్వీసు మేటర్లు స్వీకరిస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారని, అప్పటి వరకూ ఉపాధ్యాయులు వేచి ఉంటే కోర్టులో పిటిషన్ వేద్దామని న్యాయవాదులు చెబుతున్నారు. దీనితో మళ్లీ ప్రక్రియ జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు ఇలా..
గ్రేడు.2 ప్రధానోపాధ్యాయులు 310, ఎస్.ఎ. లెక్కలు 688, ఎస్.ఎ. ఎన్.ఎస్. 362, ఎస్.ఎ. ఎస్.ఎస్. 493,
ఎస్.ఎ. పీఎస్ 450, ఎస్.ఎ. పీఈ 197, ఎస్.ఎ. ఆంగ్లం 527, ఎస్.ఎ. హిందీ 317, ఎస్.ఎ. సంస్కృతం 06, ఎస్.ఎ. తెలుగు 429,
ఎస్.ఎ. ఉర్దూ 02, పీఎస్ హెచ్ఎం 293, పీఈటీ 51, ఎస్జీటీ 3,784, ఎల్పీ (తెలుగు) 79, హిందీ 36, సంస్కృతం 1 కలిపి 8,025 దరఖాస్తులు అందాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!