మడమ తిప్పుడెందుకో!
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కాకినాడ శివారు దుమ్ములపేట వద్ద మడ అడవుల ధ్వంసం కేసులో యంత్రాంగం దాగుడు మూతలు ఆడుతోంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహానికి గురైన తర్వాత ఈ అంశంలో తెగ గోప్యత పాటిస్తోంది.
ఎన్జీటీ బృందం వచ్చి వెళ్లినా యంత్రాంగం గోప్యమే
మడ ప్రాంతంలో మ్యాప్ను పరిశీలిస్తున్న కలెక్టర్ కృతికాశుక్లా, అధికారులు (పాత చిత్రం)
ఈనాడు, కాకినాడ: పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కాకినాడ శివారు దుమ్ములపేట వద్ద మడ అడవుల ధ్వంసం కేసులో యంత్రాంగం దాగుడు మూతలు ఆడుతోంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహానికి గురైన తర్వాత ఈ అంశంలో తెగ గోప్యత పాటిస్తోంది. ఎన్జీటీ సంయుక్త కమిటీ బృందం మడ ధ్వంసం చేసిన ప్రాంతాన్ని రెండు రోజులు పరిశీలించి.. సమీక్షించినా విషయం పొక్కనీయలేదు.
ఇళ్ల స్థలాలకంటూ మడను దెబ్బతీయడంతో విశాఖకు చెందిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ, రాజమహేంద్రవరానికి చెందిన డి.పాల్.. ఎన్జీటీని వేర్వేరుగా ఆశ్రయించారు. మధ్యంతర పరిహారం కింద ప్రభుత్వం రూ.5 కోట్లు చెల్లించాలని.. మడ ధ్వంసం చేసిన 58 ఎకరాల్లో నిపుణుల కమిటీ ప్రణాళిక రూపొందించాలని ఎన్జీటీ గత నవంబరులో సూచించింది. సొమ్ము జమైన మూడు నెలల్లో పర్యావరణ పునరుద్ధరణ ప్రారంభించాలని ఆదేశించింది. పరిహారాన్ని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి జమచేసినా.. పోర్టు, ఎన్హెచ్ఏఐ, ఇతర శాఖల భాగస్వామ్యంతో పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు. కాకినాడ కార్పొరేషన్ పూర్వ కమిషనర్ హయాంలో.. మడ ప్రాంతంలో మెరకను తొలగించకుండా పైపైన మొక్కలు నాటి ట్యాంకర్లతో నీరు చిమ్మడంపై ఆక్షేపణ వ్యక్తమైంది. దీనిని ఎన్జీటీ తప్పుపట్టగా.. అది ట్రయల్ రన్ అని.. నిపుణుల కమిటీ నివేదిక అందిన తర్వాత పునరుద్ధరణ చేపడతామని తాజాగా పేర్కొన్నారు. మడ ప్రాంతాన్ని ఎన్జీటీ నియమించిన ఆరుగురు నిపుణుల కమిటీ ఈనెల 24, 25 తేదీల్లో పరిశీలించింది. అన్ని అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. 58 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత పరిస్థితి.. భవిష్యత్తులో చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వారు మరోసారి పర్యటించే అవకాశాలు ఉన్నాయి. నిపుణుల బృందం వచ్చిన తర్వాత ఈనెల 27న కలెక్టర్ కృతికా శుక్లా ఎన్జీటీకి చిత్రాలతో కూడిన నివేదిక అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి