అనిశాకు చిక్కిన మున్సిపల్ ఏఈ
గుత్తేదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా పిఠాపురం పురపాలక సంఘ ఏఈ వంశీ అభిషేక్ను బుధవారం అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వలపన్ని పట్టుకున్నారు
ఏఈ వంశీ అభిషేక్
పిఠాపురం: గుత్తేదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా పిఠాపురం పురపాలక సంఘ ఏఈ వంశీ అభిషేక్ను బుధవారం అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనిశా అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపిన వివరాలివీ.. పట్టణానికి చెందిన సూరవరపు సత్తిరాజు (దివాణం) గుత్తేదారుగా పురపాలక సంఘ పరిధిలోని పార్కులో టైల్స్, సీసీ రోడ్డు పనులు రూ.6.61లక్షలు విలువైనవి పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన ఎంబుక్స్, ఆన్లైన్లో ఎంటర్ చేసేందుకు ‘పుర’ ఏఈ వంశీ అభిషేక్ రూ.40వేలు డిమాండ్ చేశారు. గుత్తేదారుడు సత్తిరాజు రాజమహేంద్రవరం అనిశా అధికారులను సంప్రదించారు. దాంతో బుధవారం సత్తిరాజు ఏఈకి రూ.40వేలు ఇస్తుండగా అనిశా అధికారులు పట్టుకుని సాయంత్రం వరకూ విచారణ చేపట్టారు. అనంతరం కార్యాలయం సమీపంలోనే నివాసముంటున్న ఏఈ ఇంటిలో తనిఖీలు చేపట్టేందుకు అనిశా అధికారులు వెళ్లారు. ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన పనులన్నింటిపైనా లోతుగా విచారిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ సౌజన్య వివరించారు.ఈ దాడుల్లో సీఐలు పుల్లారావు, వై.సతీష్, డి.వాసు కృష్ణ, బి.శ్రీనివాసు, ఎస్సై విల్సన్ పాల్గొన్నారు.
పదేళ్లుగా ఇక్కడే..
పిఠాపురం పురపాలక సంఘంలో 2013లో ఏఈగా వంశీ అభిషేక్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇక్కడే ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. వంశీ అభిషేక్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నిత్యం గుత్తేదారులు, కౌన్సిలర్లు కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ఏఈ తీరును తప్పుబడుతూనే ఉన్నారు. అయినా ఇక్కడ నుంచి ఏఈని బదిలీ చేయించేందుకు తెదేపా, వైకాపా నాయకుల ప్రయత్నాలు ఫలించలేదు. ఈసారి బదిలీల్లో కూడా ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి మంగళవారం రోజున విజయవాడ కౌన్సెలింగ్కు వెళ్లి వచ్చారు. మరో రెండు, మూడు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు అందుతాయని అనుకుంటున్న తరుణంలో బుధవారం అనిశాకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?