భూముల ధరలకు రెక్కలు
ఒక్కసారిగా భూముల ధరలు 30 నుంచి వంద శాతం పెంచడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.
ప్రాంతాల వారీగా పెంపు
న్యూస్టుడే, గాంధీనగర్(కాకినాడ)
కక్షిదారులు లేక వెలవెలబోతున్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
ఒక్కసారిగా భూముల ధరలు 30 నుంచి వంద శాతం పెంచడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గురువారం బోసిపోయాయి.
పెరిగిన ధరలు ఇలా...
* కాకినాడ నగరంలోని 2, 5, 6, 7, 13, 20, 28, 43 బ్లాకుల్లో గజం రూ.75వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.95వేలకు పెంచారు. కాకినాడ గ్రామీణం గంగనాపల్లిలో ఇప్పటి వరకు చదరపు గజం రూ.7వేలు ఉండగా, తాజాగా రూ.10,000కు పెంచారు.
* సూర్యారావుపేట నివాసప్రాంతం పార్టులో రూ.10వేల నుంచి 15వేలకు, డోర్ నంబర్ల వారీగా పలు ప్రాంతాల్లో రూ.15వేల నుంచి రూ.20 వేలకు పెంచారు.
* తూరంగిలో రూ.8వేల నుంచి రూ.11వేలకు పెంచగా, డోర్ నంబర్ల వారీగా కొన్ని ప్రాంతాల్లో రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పెంచారు.
* కొవ్వాడ పరిధిలో రూ.6,500 నుంచి రూ.8,500కు, కరప మండలం నడకుదురులో రూ.4వేల నుంచి రూ.6వేలకు, పెదపూడి మండల పరిధిలోని ఏపీత్రయం, రామేశ్వరంలలో రూ.4,200 నుంచి రూ.6వేలకు పెంచారు.
* అపార్టుమెంట్లకు చెందిన కాంపోజిషన్ విలువలు సైతం భారీగా పెంచారు. గంగానపల్లిలో పల్లపుభూమి ఎకరా రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెంచగా, మెరకభూమి ఎకరా రూ.48 లక్షల నుంచి 65 లక్షలకు పెరిగింది. ఇళ్లు నిర్మించుకోవానికి అనుకూలమైన ప్రాంతాల్లో ఎకరా రూ.80 లక్షల నుంచి రూ.1.21 కోట్లకు పెరిగింది. ఇంటిస్థలాలు ఎకరా రూ.3,38,80,000 ఉండగా, ప్రస్తుతం రూ.4,84,00,000కు పెరిగింది.
నిశ్శబ్దంగా పెంచేసి.....
ఒకవైపు భూముల ధరలకు రెక్కలు వచ్చిన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సందట్లో సడేమియాగా బుధవారం రాత్రి మరో జీవో విడుదల చేసింది.పురపాలక సంఘాల పరిధిలో నివాస సముదాయాలకు ప్రస్తుతం చదరపు అడుగు రూ.1300 ఉండగా దానిని రూ.1400 పెంచారు. వాణిజ్య ప్రాంతాల్లో రూ.1300 నుంచి రూ.1700కు పెంచారు. గ్రామాల్లో ఆర్సీసీ, డాబా ఇళ్లకు చదరపు అడుగుకు రూ.650 ఉండగా, ప్రస్తుతం రూ.850కు పెంచారు. గ్రామాల్లో వాణిజ్యానికి ఉపయోగించే ప్రాంతంలో వెయ్యికి పెరిగింది. పెంకుటిళ్లు చదరపు అడుగు రూ.650 ఉండగా, దానిని 700కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)