అగ్గి రేగితే ఆందోళనే
ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరింగ్ సరిగాలేనిచోట్ల, పరిమితికి మించి విద్యుత్తు వినియోగం సమయంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదకరంగా విద్యుత్తు బాక్సులు
మసీదుసెంటర్(కాకినాడ), న్యూస్టుడే: ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరింగ్ సరిగాలేనిచోట్ల, పరిమితికి మించి విద్యుత్తు వినియోగం సమయంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్తు షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించి విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చాలి ఉండగా.. కొన్ని విభాగాల్లో అలాంటి ప్రయత్నాలు చేయలేదు. కాకినాడ జీజీహెచ్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆసుపత్రిలోని పలు వార్డుల్లో వైరింగ్ సరిగా లేదు. అరకొర అగ్నిమాపక పరికరాలతో ప్రమాదం సమయంలో భద్రత ప్రశ్నార్థకమే. గురువారం జరిగిన ప్రమాదంలో రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు. మెడికల్వార్డు ఏఎంసీ-1 ఐసీయూలో ఏసీకి విద్యుత్తు సరఫరా చేసే డీసీ బాక్సులో షార్ట్సర్క్యూట్ జరగడంతో పొగలు వ్యాపించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ 11 మంది రోగులు ఉండగా సిబ్బంది, రోగుల సహాయకులు సకాలంలో స్పందించి వారిని బయటకు తీసుకువెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది.
ఆసుపత్రిలో లోపాలు ఇలా...
ఆసుపత్రిలో ఎక్కువ భవనాలు పాతవే. వార్డుల్లో వైరింగ్ సైతం అస్తవ్యస్తంగా ఉండటం, విద్యుత్తు తీగలు కిందకు వేలాడటం, బోర్డులు సరిగా లేకపోవడం, స్విచ్బోర్డులు తలుపులు లేకుండా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడేందుకు పలువార్డుల్లో ఎలాంటి మార్గాలు లేవు. ఆసుపత్రిలో నీటి నిల్వకోసం సంపును ఏర్పాటు చేసుకోవాలి. అక్కడి నుంచి అన్ని గదులకు పైపులైన్లు ఏర్పాటు చేయాలి. అగ్నిప్రమాదం జరగగానే సైరన్ మోగేలా ఏర్పాట్లు ఉండాలి. పై అంతస్తులో ప్రమాదాలు జరిగినపుడు రోగులు, సిబ్బందిని కిందకు దింపేలా భవనానికి రెండు వైపులా ప్రవేశ మార్గాలు ఉండాలి. భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. ఆసుపత్రిలోని పలు వార్డులకు రూ.లక్షలు ఖర్చుచేసి నీటి సరఫరాకు సంబంధించిన పైపులు ఏర్పాటు చేశారు. వాటిని పూర్తిస్థాయిలో అమర్చకుండా వదిలేశారు. దీంతో ఆ వ్యవస్థ పనిచేయడం లేదు.
ఓపీ భవనంలో అసంపూర్తిగా పైపులైను
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల