గుంతలను తప్పించబోయి రెండు బస్సుల ఢీ
రెండు పెద్ద గుంతలను తప్పించే క్రమంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రయాణికులు
ఇరవై మందికి పైగా స్వల్ప గాయాలు
సంఘటనా స్థలంలో ఢీకొన్న బస్సులు
ద్వారపూడి, అనపర్తి గ్రామీణం, మండపేట గ్రామీణం, న్యూస్టుడే: రెండు పెద్ద గుంతలను తప్పించే క్రమంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్లు సడన్ బ్రేక్ వేయడంతో ఒక బస్సులో కండక్టర్ మహేశ్వరి తను సీటులోంచి తూలి ద్వారం నుంచి కొంతదూరంలో కిందపడ్డారు. మరో బస్సులో ఓ బస్సు అద్దం పగిలి అందులోంచి పాణింగిపల్లి భీమిరాజు అనే ప్రయాణికుడు బయటకు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మండపేట మండలం జడ్.మేడపాడు పెట్రోలు బంకు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
తీవ్రంగా గాయపడిన భీమరాజు, సన్యాసమ్మ
రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళుతున్న, కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వస్తున్న రెండు బస్సులు జడ్.మేడపాడులో ఢీకొన్నాయి. ఆ సమయంలో రెండు బస్సుల్లో కలిపి 110 ప్రయాణికులున్నారు. ప్రమాదంలో కండక్టర్ మహేశ్వరి తలకు బలైమైన గాయాలై అధిక రక్తస్రావం జరిగింది. అనపర్తి సావరానికి చెందిన పాణింగిపల్లి భీమరాజు పక్కటెముకులు, తలకు తీవ్రగాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ నుంచి ధవళేశ్వరం వెళ్తున్న సన్యాసమ్మ అనే మరో ప్రయాణికురాలికి సీటు రాడ్డు ముఖానికి తగిలి గాయమైంది. ఆమెకు అనపర్తిలో వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. గాయపడిన మరో ప్రయాణికురాలికి ప్రథమ చికిత్స అనంతరం అనపర్తిలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. రెండు బస్సుల్లో సుమారు 20 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం డిపో మేనేజరు షేక్ షబ్నం, అసిస్టెంట్ డిపో మేనేజరు అజయ్బాబు, సిబ్బంది అనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పరామర్శించి, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాద ఘటనతో అనపర్తి, కడియం, మండపేట వైపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనపై కేసులు నమోదు చేస్తామని మండపేట రూరల్ ఎస్సై శివకృష్ణ తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శిస్తున్న డిపో మేనేజరు షబ్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ