భానుడు భగభగ.. ఆరోగ్యానికి సెగ!
ఎండలు మండుతున్న నేపథ్యంలో సమతుల్యమైన జీవనశైలితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండలు మండుతున్న నేపథ్యంలో సమతుల్యమైన జీవనశైలితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం నుంచి ఆహారం వరకు అన్నిట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
వ్యాయామం: వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు బయట ఉష్ణోగ్రతలు కారణంగా చెమట రూపంలో లవణాలు బయటకు పోతాయి. ఈ నేపథ్యంలో సూర్యోదయంలోపే 45 నిమిషాలకు మించకుండా, మంచి శిక్షకుడి ఆధ్వర్యంలో వ్యాయామం పూర్తి చేయాలి.
నీళ్లు: ఎక్కువ శాతం నీటిని తాగడం వల్ల ప్రయోజనం తక్కువే. అలా కాకుండా కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తీసుకోవడం వల్ల చెమట రూపంలో పోయిన లవణాలు శరీరానికి తిరిగి అందుతాయి. ఎండలో పనిచేసే వారికి ఇవి మరింత అవసరం.
ఆహారం: అతిగా మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. తేలికపాటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. కూరగాయలతోపాటు మసాలాలు లేకుండా ఉడికించిన చేపలు, చికెన్ లాంటివి తీసుకోవచ్చు.
ఆటలు: పిల్లలు, పెద్దలు ఎండలో ఆటలు ఆడకపోవడమే మేలు. దీనివల్ల తీవ్రమైన డీహైడ్రేషన్కు గురవుతారు. సాయంత్రం వేళ వాతావరణం చల్లబడిన తర్వాతే పిల్లలను ఆటలకు పంపాలి. ఈత, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్కు ప్రాధాన్యం ఇవ్వడం మేలు.
ఏసీలు, కూలర్లు: ఏసీల్లో ఎక్కువ సమయం గడపటం వల్ల డ్రైఐస్ లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చల్లదనం వల్ల కొందరు నీళ్లు సక్రమంగా తీసుకోరు. ఫలితంగా యూరిన్ ఇన్ఫెక్షన్కు దారి తీస్తుంది. ఏసీల్లో ఫిల్టర్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కూలర్లలో దుమ్ము పట్టకుండా చూసుకోవాలి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు