సత్యదేవుని ఆశీస్సులతో వారాహి యాత్ర
కొండగట్టు అంజన్న ఆలయంలో.. విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో పూజలతో సిద్ధమైన వారాహి వాహనం.. అన్నవరం సత్యదేవునికి పూజలు చేసిన అనంతరం ఉమ్మడి జిల్లాలో యాత్రకు బయలుదేరనుంది.
పది రోజులు 8 నియోజకవర్గాల్లో జనసేనాని పర్యటన
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, కడియం: కొండగట్టు అంజన్న ఆలయంలో.. విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో పూజలతో సిద్ధమైన వారాహి వాహనం.. అన్నవరం సత్యదేవునికి పూజలు చేసిన అనంతరం ఉమ్మడి జిల్లాలో యాత్రకు బయలుదేరనుంది. వారాహి యాత్రపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. తూర్పు నుంచే సమర శంఖం పూరిస్తారనే సంకేతాలిచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఈనెల 14 నుంచి 23 వరకు తొలిదశ యాత్ర సాగుతుందని జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తెలిపారు.
ఈనెల 13న రాత్రికి వారాహి వాహనం అన్నవరం చేరుకుంటుంది. 14న ఉదయం కొండపై సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం అధినేత పవన్ కల్యాణ్ యాత్రకు శ్రీకారం చుడతారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజక వర్గాల మీదుగా యాత్ర సాగుతుంది. అనంతరం గోదావరి వంతెన మీదుగా ఉమ్మడి ప.గో.జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
బహిరంగ సభలకు సన్నాహాలు
ఈ పర్యటనలో కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, నగరం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలులో బహిరంగ సభలకు పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. రోజు విడిచి రోజు సభ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పర్యటన క్రమంలో బస, సభలు, భద్రతకు సంబంధించి అనుమతులపై నాయకులు దృష్టిసారించారు.
సమస్యలే శస్త్రాలుగా..
రాష్ట్ర రాజకీయాల్లో తూర్పు సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తే ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ ఈ జిల్లాలపై దృష్టిసారించాయి. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే కీలక సమస్యలు, ప్రజల ఇబ్బందులను గుర్తించిన జనసేన.. వారితో ప్రత్యేకంగా మాట్లాడి భరోసా నింపాలనే నిర్ణయానికి వచ్చింది. ఆయా వర్గాలకు బహిరంగ సభల వేదికపై పవన్ భరోసా ఇస్తూనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు సమాచారం.
నిత్యం గంట సమావేశం
ప్రతిరోజూ ఉదయం మహిళలు, వీర మహిళలతో గంటపాటు సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తిస్తారు. రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలతోపాటు పీడిత ప్రజల సమస్యలు వింటూ వారి నుంచి వినతులు స్వీకరణకు కొంత సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కేడర్తో పవన్ చర్చిస్తారని, పార్టీని విజయపథంలో నడిపించే వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తెలిపారు. యాత్ర పొడవునా స్థానిక సమస్యలపై అధ్యయనం చేసి ఎన్నికల అనంతరం వాటి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తారని వివరించారు. పోలీసులకు సహకరిస్తూనే యాత్రను స్వచ్ఛందంగా వచ్చిన వాలంటీర్లుతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)