గ్యాస్ సిలిండరుతో అల్లుడి దాడి
సొసైటీ నుంచి తాను తీసుకున్న పంట రుణం తీర్చేందుకు సొమ్ములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఐదు కిలోల గ్యాస్ సిలిండరుతో అత్తమామలపై అల్లుడు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది.
మామ మృతి.. అత్తకు తీవ్ర గాయాలు
కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే : సొసైటీ నుంచి తాను తీసుకున్న పంట రుణం తీర్చేందుకు సొమ్ములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఐదు కిలోల గ్యాస్ సిలిండరుతో అత్తమామలపై అల్లుడు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ దాడిలో మామ రాయంకుల శ్రీరామకృష్ణ (62) అక్కడికక్కడే మృతి చెందగా, అత్త బేబీ తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉంది. అల్లుడు నందిగం గోపాలకృష్ణ (గోపి) పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశివేదలకు చెందిన రాయంకుల శ్రీరామకృష్ణ, బేబి దంపతులకు కుమారుడు బ్రహ్మేంద్ర, కుమార్తె లక్ష్మిశ్రీ సంతానం. కుమార్తెను అదే ఊరికి చెందిన మేనమామ కొడవలి రత్నాజీతో వివాహం చేయగా ఒక కుమారుడు సాయిమౌళి ఉన్నాడు. కొన్నాళ్లకు రత్నాజీ చనిపోవడంతో దొమ్మేరుకు చెందిన గోపాలకృష్ణ (గోపి)తో లక్ష్మిశ్రీకి రెండో పెళ్లి చేసి ఇల్లరికంగా పెట్టుకున్నారు. గోపి దంపతులు పదేళ్లుగా శ్రీరామకృష్ణ ఇంట్లోనే ఉంటున్నారు. లక్ష్మీశ్రీ ముందు భర్తకు చెందిన ఎకరంన్నర పొలాన్ని ఈ మధ్య అమ్మగా కొంత సొమ్ము వచ్చింది. ఇందులో రూ. 4.80 లక్షలు చెల్లించి గోపి తాకట్టు పెట్టిన లక్ష్మిశ్రీకి చెందిన బంగారు ఆభరణాలు తీసుకురావాలని శుక్రవారం ఉదయం అత్తమామలు చెప్పారు. ముందుగా తాను తీసుకున్న పంట రుణానికి రూ.2.20 లక్షలు చెల్లిస్తానని గోపి బదులిచ్చాడు. దీనికి అత్త, మామ, భార్య ఒప్పుకోలేదు. బంగారం విడిపించాలని కరాఖండిగా చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. అక్కడున్న 5 కిలోల గ్యాస్ సిలిండరుతో అత్త బేబిపై అల్లుడు దాడి చేయగా బలమైన దెబ్బ తగిలి కింద పడిపోయారు. అడ్డు వచ్చిన మామ శ్రీరామకృష్ణను తలపై బండతో కొట్టడంతో రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన బేబిని కొవ్వూరు ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఆమె చికిత్స పొందుతున్నారు. లక్ష్మిశ్రీతోపాటు సోదరుడు బ్రహ్మేంద్ర, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మామ చనిపోవడంతో అల్లుడు గోపి సిలిండరును గోడ పక్క స్థలంలో విసిరేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఇంట్లో ఉంచిన రూ.4.80 లక్షల నగదు కనిపించకపోవడంతో అతడు ఆ సొమ్ము తీసుకెళ్లిపోయాడని అనుమానిస్తున్నారు. హత్య జరిగిందన్న సమాచారంతో గ్రామీణ ఎస్ఐ జి.సతీష్, సీఐ వైవీ రమణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ సంఘటన స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన తీరు తెలుసుకుని అధికారులకు సూచనలిచ్చారు. వేలిముద్ర నిపుణులను రప్పించారు. లక్ష్మిశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన గోపీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
-
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు