ముగ్గురు యువకుల మృతితో వెల్లలో విషాదం
పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లి ఉపాధి పొందుతున్న యువకులను విధి వంచించింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు.
మర్రెడ్డి రాజేష్, గానుగుల సాయిరాం, ఈతా వరప్రసాద్
నార్కట్పల్లి గ్రామీణం, ద్రాక్షారామ, న్యూస్టుడే : పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లి ఉపాధి పొందుతున్న యువకులను విధి వంచించింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు. డాక్టరు బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన గానుగుల సాయిరామ్ (21), మర్రెడ్డి రాజేష్ (22), ఈతా వరప్రసాద్ (22) శనివారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారు విజయవాడ-హైదరాబాద్ రహదారిపై వైవంతెనపై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెంట్రింగ్కు వాడే రేకులు వ్యానులో వేసుకుని స్వగ్రామం వెల్ల వస్తుండగా టైరు పేలిపోవడంతో వ్యాను బోల్తా పడింది. రేకులపై కూర్చొన్న ముగ్గురు యువకులూ కింద పడ్డారు. వీరిపై రేకులు పడి సాయిరామ్, రాజేష్ అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ను హైదరాబాద్ తరలించగా చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం మరణించారు. యువకులు ముగ్గురూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఇంకా వివాహాలు కాలేదు. కుటుంబాలకు వీరే పెద్ద దిక్కు. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో వెల్లలో విషాదఛాయలు అలముకున్నాయి.
కుటుంబాలకు వీరే ఆధారం..
రాజేష్ హైదరాబాద్లో తండ్రి పట్టాభిరామయ్యతో కలిసి నర్సరీలో పనిచేస్తున్నారు. తల్లి లక్ష్మి స్వగ్రామంలోనే ఉంటున్నారు. వీరి కుటుంబానికి అతడే ఆధారం. ఒక్కగానొక్క బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి బోరున విలపిస్తున్నారు. ఈతా వరప్రసాద్ తాపీ, సెంట్రింగ్ పనులు చేస్తుంటారు. తండ్రి లేడు. తల్లి రమణ ఊళ్లోనే ఇడ్లీ అమ్ముకొంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. గానుగుల సాయిరామ్ మినీ వ్యాను కొనుక్కొని జీవనోపాధి పొందుతున్నారు. తండ్రి నాగబాబు, తల్లి వీరవేణి. ఎదిగొచ్చిన కొడుకుకు పెళ్లి చేయాలని నిశ్చయించుకొనే లోపే విధి తమకు దూరం చేసిందని వారు రోదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్