శానిటేషన్ కార్యదర్శులకు షాక్..!
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణపై ప్రతిష్టంభన నెలకొంది. మూడు రోజులుగా శానిటేషన్ కార్యదర్శులు వార్డు సచివాలయ సమయపాలనలోనే విధులకు హాజరవుతున్నారు.
షోకాజ్ నోటీసులు జారీ
పనుల నిర్వహణపై ప్రతిష్టంభన
కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన కార్యదర్శులు (పాత చిత్రం)
బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్టుడే: కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణపై ప్రతిష్టంభన నెలకొంది. మూడు రోజులుగా శానిటేషన్ కార్యదర్శులు వార్డు సచివాలయ సమయపాలనలోనే విధులకు హాజరవుతున్నారు. ఉదయం 5.30 గంటల నుంచే విధులకు హాజరుకాలేమని, యూజర్ ఛార్జీలు వసూలు చేయలేమని, గతనెల 30న నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్కుమార్కు లేఖ అందజేశారు. ఈ నెల 1 నుంచి మిగతా సచివాలయ ఉద్యోగులు వెళ్లే సమయానికి విధులకు హాజరవుతున్నారు. దీంతో 80 మందికి శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
జీవో 650లో ఏముంది..?
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో శానిటేషన్ కార్యదర్శులు ఈ నిర్ణయం తీసుకున్నారని, దానినే కాకినాడలో పాటిస్తున్నామని, మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటని వాపోతున్నారు. దీనికి అధికారుల వాదన మరోలా ఉంది. 2019, అక్టోబరు 3న విడుదల చేసిన 650 జీవో ప్రకారం.. ఇంటింటా చెత్త సేకరణ, తడి, పొడి చెత్త విభజన, మూడు గంటలకు తక్కువ కాకుండా ఫీల్డ్ విజిట్, నూరు శాతం పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ చేయాలని, ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యత శానిటేషన్ సెక్రటరీలపై ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 13న ఇచ్చిన సవరించిన జీవో 25 ప్రకారం యూజర్ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. శానిటేషన్ కార్యదర్శులు ఉదయాన్నే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంటున్నారు.
క్రమశిక్షణ చర్యలు తప్పవు
-సీహెచ్.నాగనరసింహారావు, అదనపు కమిషనర్, నగరపాలక సంస్థ
అన్నిచోట్లా ఇదే సమయ పాలన విధానం అమలు చేస్తున్నారు. దీనిని కాదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యత వీరిపై ఉంది. ఇప్పుడు సచివాలయ వేళల్లో పనిచేస్తామని చెప్పడం దీనికి విరుద్ధం. షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఏం సమాధానం ఇస్తారో చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి