మట్టి ట్రాక్టర్లుకు.. ఇంకెందరు బలికావాలి..
ఎంతో ఉన్నత భవిష్యత్తున్న బాలికలు. చక్కగా చదువుకుంటున్నారు. కన్నవారి ఆశలకు ప్రతిరూపాలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిని మట్టి ట్రాక్టర్లు బలిగొంటున్నాయి.
మృతదేహం వద్ద విలపిస్తున్న ప్రశాంతి తండ్రి బాలాజీ (పాత చిత్రం)
న్యూస్టుడే, అమలాపురం పట్టణం: ఎంతో ఉన్నత భవిష్యత్తున్న బాలికలు. చక్కగా చదువుకుంటున్నారు. కన్నవారి ఆశలకు ప్రతిరూపాలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిని మట్టి ట్రాక్టర్లు బలిగొంటున్నాయి. వరుస ఘటనలతో అమలాపురం పరిసర ప్రాంతాలవారు తమ పిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నారు. పల్లె, పట్టణం తేడాలేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై ఎక్కడచూసినా మట్టి ట్రాక్టర్లే. నల్లవంతెన, ఎర్రవంతెన, విత్తనాలవారి కాలువగట్టు, అల్లవరం, ఉప్పలగుప్తం రోడ్లు.. ఇలా ఏమూలచూసినా మట్టి ట్రాక్టర్లు ఉంటున్నాయి. వాటి వేగానికి రహదారిపై బైకులు, కార్లు వెళ్లేదారికూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టానుసారం..
చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకుని, డ్రైవింగ్ లైసెన్స్కూడా లేకుండా, నిర్లక్ష్యంగా, మద్యం తాగి, పెద్ద శబ్దాలతో పాటలు వింటూ ట్రాక్టర్లు నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్డుపైకి వచ్చేందుకు వణికిపోతున్నారు. మట్టి తరలింపుదారులిచ్చే డబ్బులకు ఆశపడి.. రాజకీయ నాయకుల దన్నుతో అక్రమ మట్టితవ్వకాలపై పోలీస్, రెవెన్యూ, రవాణాశాఖ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
పుట్టినరోజు సందడికి వెళ్లి..
అమలాపురం మండలం నడిపూడికి చెందిన పెనుమాల ప్రశాంతి(16) పదో తరగతి పరీక్షలురాసింది. వేసవి సెలవుల్లో తన స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కునేందుకు నడిపూడి లాకుల వద్దనున్న దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ఇరుకుగా ఉన్న ఆ రోడ్డులో వేగంగా వచ్చిన మట్టి ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రశాంతి అక్కడక్కడే మృతిచెందగా మిగిలిన ఇద్దరు స్నేహితురాళ్లు సరెళ్ల మానస, సరెళ్ల సత్యభవాని గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే తమ కుమార్తె మృతిచెందిందని ప్రశాంతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆడుకుని వస్తూ..
అమలాపురం మహిపాలవీధికి చెందిన జంగా లక్ష్మీజాహ్నవి(11) ఆరో తరగతి చదివింది. మే 19న జాహ్నవి సైకిల్పై గాంధీనగర్ శివారుకు వెళ్లి తన స్నేహితురాలితో ఆనందంగా ఆడుకుని ఇంటికి తిరిగొస్తోంది. గాంధీనగర్ దారిలో సైకిల్ చైన్ ఊడిపోవడంతో దిగి చూస్తుండగా అటుగా వెళ్తున్న మట్టిట్రాక్టర్ చిన్నారిని బలిగొంది. ట్రాక్టర్ డ్రైవర్ బాలికను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడు. మిట్టమధ్నాహ్నం కావడం, ఆ సమయంలో ఎవరూ చిన్నారిని చూడకపోవడంతో బాలిక తీవ్రగాయాలతో రోడ్డుపైనే విలవిల్లాడింది. చాలాసేపటికి స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించినా అదేరోజు అర్ధరాత్రి మృతిచెందింది. కనీసం మానవత్వంతో డ్రైవర్ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రాణపాయం తప్పేదేమోనని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. చదువులో ఎప్పుడూ ముందుండే కుమార్తె దూరమవ్వడంతో మంచి భవిష్యత్తు చూపించాలనే వారి ఆశలు అడియాశలయ్యాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం
- అశోక్ప్రతాపరావు, జిల్లా రవాణాశాఖాధికారి
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నిర్లక్ష్యంగా, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 460 మందిపై కేసులుపెట్టి రూ.23 లక్షలు వసూలు చేశాం. సరైన ధ్రువపత్రాలులేని ట్రాక్టర్లపై 614 కేసులు పెట్టాం. 33 వాహనాలను స్వాధీనం చేసుకుని, వేలంలో రూ.7.49లక్షలకు విక్రయించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్