వారాహి యాత్ర సాగేదిలా..
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 14న అన్నవరం నుంచి ప్రారంభించనున్న వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 24 వరకు జరుగుతుందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న కందుల దుర్గేశ్, పార్టీ నాయకులు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 14న అన్నవరం నుంచి ప్రారంభించనున్న వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 24 వరకు జరుగుతుందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ తెలిపారు. సోమవారం కాకినాడలోని ముత్తా క్లబ్లో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జులు, పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారాహి యాత్ర రూట్మ్యాప్ను వివరించారు. ఆయన తెెలిపిన వివరాల ప్రకారం..* 14వ తేదీ సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం పిఠాపురం చేరుకుని బస చేస్తారు.*15, 16 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో యాత్ర నిర్వహించి చేతివృత్తులు, చేనేత, వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటారు.* 16న పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించి అక్కడే రాత్రి బస చేస్తారు.* 17, 18, 19 తేదీల్లో ఆయన కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం నియోజక వర్గాల్లో యాత్ర నిర్వహిస్తారు. 19న కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాలకు సంబంధించి కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ప్రదేశం ఖరారు కావాల్సి ఉంది.* 20 నుంచి 24 వరకు ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది.* యాత్రలో జనసేన శ్రేణులు పవన్కల్యాణ్కు పూలదండలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నామని దుర్గేశ్ చెప్పారు. క్రమశిక్షణతో యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. దశల వారీగా రాష్ట్రమంతటా వారాహి యాత్ర నిర్వహించేందుకు రూట్మ్యాప్ ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకోవడానికి పవన్కల్యాణ్ ఈ యాత్ర చేస్తున్నారన్నారు. సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జులు మేడా గురుదత్త ప్రసాద్, శెట్టిబత్తుల రాజబాబు, తుమ్మల బాబు, వరుపుల తమ్మయ్యబాబు, అత్తి సత్యనారాయణ, వేగుళ్ల లీలాకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాస్, పాఠంశెట్టి సూర్యచంద్ర, పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?