కన్నెత్తి చూడరు.. లెక్కా పత్రం అడగరు..!
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఓ ప్రైవేటుసంస్థకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడ ర్యాంపులు ఇచ్చారో.. ఎక్కడ తవ్వుతున్నారో తెలియని పరిస్థితి.
అడ్డగోలు ఇసుక తవ్వకాలతో గోదారమ్మకు తూట్లు
కపిలేశ్వరపురం మండలం తాతపూడి పుష్కర ఘాట్ వద్ద భారీగా ఇసుక నిల్వలు
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే,పి.గన్నవరం, కపిలేశ్వరపురం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఓ ప్రైవేటుసంస్థకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడ ర్యాంపులు ఇచ్చారో.. ఎక్కడ తవ్వుతున్నారో తెలియని పరిస్థితి. ఏ రీచ్ నుంచి రోజుకు ఎన్ని లారీల ఇసుక తరలుతోందన్న లెక్కాపత్రం లేదు. తవ్వకాల్లో నిబంధనల అమలు జరుగుతుందా.. లేదా.. అనేది క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా ఇసుక దందా నడుస్తోంది. ఇసుక తవ్వకాల్లో నదీ పరివాహక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా.. ప్రాణాలు పోతున్నా అటువైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు సాహసించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పరిస్థితిపై పరిశీలనాత్మక కథనం.
గోదావరి నదీ గర్భంలో పరివాహక చట్టానికి(రివర్ కన్జర్వేషన్ యాక్ట్) లోబడే తవ్వకాలు జరపాలని నిబంధన. గోదావరి ప్రస్తుత మట్టానికి గరిష్ఠంగా మీటరున్నర లోతు మాత్రమే తవ్వాలి. కానీ భారీ యంత్రాలతో 20 అడుగులకు పైగా అంటే సుమారు ఆరు మీటర్ల లోతున నదీ గర్భాన్ని యంత్రాలతో తొలిచేస్తున్నారు. యంత్రాలతో తవ్వితే ఈ తరహా సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ నదీ గర్భాల్లో యంత్రాలతో తవ్వేందుకు నిరాకరిస్తుంది. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఇవీ నిబంధనలు
* ఇసుక, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే ముందుగా గనులు, భూగర్భ జల, రెవెన్యూ, వ్యవసాయ, హెడ్వర్క్సు తదితర శాఖల అధికారులు సంయుక్త పరిశీలన చేయాలి. *నిబంధనలకు లోబడి ఉంటే ఎన్వోసీ ఇవ్వాలి. * తవ్వకాలు ఎన్ని క్యూబిక్ మీటర్ల మేర చేపట్టాలన్నది ఉత్తర్వుల్లో పేర్కొనాలి. *తవ్వకాలు చేపట్టే ప్రదేశం హద్దులు చూపిస్తూ జియోకార్డినేట్ ఏరియాను నిర్ణయించి ఆ పరిధిలో ఎర్రజెండాలు పాతాలి. * గరిష్ఠంగా మీటరున్నర లోతు మించి తవ్వకాలు చేపట్టకూడదు. * ఇసుక, మట్టి తరలించే సమయంలో శబ్ద కాలుష్యం ఉండకూడదు. (రాజమహేంద్రవరంలోని ఓ ఇసుక రీచ్కు జిల్లా కమిటీలో నిర్ణయించి అనుమతులిచ్చారు. నివాసాల మధ్య రీచ్ ఉండడం నిబంధనలకు విరుద్ధమని స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అనుమతులిచ్చే ముందు నిబంధనలు పాటించలేదని, రివర్ కన్జర్వేటర్ నుంచి ఎన్వోసీ తీసుకోలేదని పేర్కొంటూ అనుమతులను న్యాయస్థానం రద్దు చేసింది.
ఉల్లంఘన ఇలా..
* వరదల సమయంలో నీటి ఉద్ధృతి నుంచి కాపాడే ఏటిగట్లపై భారీ వాహనాలు నడపకూడదు. కొన్ని సందర్భాల్లో రైతు ఉత్పత్తులు తరలించేందుకు మాత్రమే 10 నుంచి 14 టన్నుల వరకు అనుమతిస్తారు. రాజమహేంద్రవరం పరిధిలో అవేమీ పట్టనట్లు అఖండ గోదావరి ఎడమ ఏటిగట్టుపై రేయింబవళ్లు భారీ వాహనాలు వందల సంఖ్యలో తిరుగుతున్నాయి.
* బోట్స్మెన్ సొసైటీ పేరుతో అనుమతులు
తీసుకుని.. ఆయా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా చిన్నబోట్లకు డ్రెడ్జర్లు అమర్చి ఇసుక భారీగా వెలికి తీస్తున్నా అధికారులకు పట్టకపోవడం గమనార్హం. ఇష్టారాజ్యంగా నదీ ప్రవాహానికి అడ్డుగా కిలో మీటర్ల మేర బాటలు నిర్మిస్తున్నా ఎవరూ కన్నెత్తి చూడడంలేదు.
అన్నీఅనర్థాలే...
గోదావరిలో ఇష్టారాజ్యంగా 20 నుంచి 25 అడుగుల లోతులో యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ గోతుల్లోకి ఊట నీరు చేరి చేపల చెరువులను తలపిస్తున్నాయి. ఏటిగట్లకు ఆనుకుని సైతం అదే రీతిన తవ్వుతున్నారు. దీని వల్ల గోదావరిలో సాధారణ నీటి మట్టం ఉన్నప్పుడు లంకలకు స్థానికులు నడిచి వెళ్లే క్రమంలో గోతులు గుర్తించక మృత్యువాత పడిన ఘటనలున్నాయి. ఇలా డాక్టర్
బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే ఈ ఏడాదిలో మే వరకు అయిదు నెలల వ్యవధిలో అయిదుగురు చనిపోయారు.
* అధిక లోడుతో టిప్పర్లు వెళ్తున్న సమయంలో కొన్నిచోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరుతున్నాయి. దారులు ధ్వంసమవుతున్నాయి. పి.గన్నవరం మండలం వై.వి.పాలెం వద్ద ఇసుక, మట్టి లారీల రాకపోకలతో వంతెన శిథిలావస్థకు చేరింది. కందాలపాలెం వద్ద ర.భ.శాఖ రహదారి దెబ్బతింది. పి.గన్నవరం మూడు రహదారుల కూడలి నుంచి అంబాజీపేట వైపు ర.భ.శాఖ రహదారి మరింత అధ్వానంగా మారింది.
కోనసీమ ప్రాంతంలో...
కోనసీమ ప్రాంతంలో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, అల్లవరం, ముమ్మిడివరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, రావులపాలెం, ఆత్రేయపురం తదితర మండలాల్లో వశిష్ఠ, వైనతేయ, గౌతమి గోదావరి తీరాల్లో ఇసుక, తువ్వ ఇసుక, లంకమట్టి తవ్వకాలు సాగుతున్నాయి. పి.గన్నవరం మండలంలో మానేపల్లి, కందాలపాలెం, లంకలగన్నవరం, వై.వి.పాలెం,
బెల్లంపూడి ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా చేస్తున్నారు.
అనుమతులు లేకున్నా..
కపిలేశ్వరపురంలో పగటి పూట పదుల సంఖ్యలో, రాత్రయితే వందల సంఖ్యలో వాహనాల్లో ఇసుక రవాణా సాగుతోంది. కపిలేశ్వరపురం-తాతపూడి గ్రామాల వద్ద గోదావరిలో 15 అడుగుల లోతున గోతులు ఏర్పడ్డాయి. దీనిపై తహసీల్దారు సూర్యారావు వివరణ కోరగా పరిస్థితి ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. ర్యాంపు నిర్వహణకు అనుమతులొచ్చాయని మైన్స్ అధికారులు చెప్పినా, తమకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదన్నారు.
తనిఖీలు చేపట్టి చర్యలు
ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చినప్పుడే కచ్చితంగా నదీ పరివాహక చట్టానికి లోబడే తవ్వకాలు చేపట్టాలని, నిబంధనలు అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశాం. నదీ గర్భంగా మీటరున్నరకు మించి తవ్వకూడదు. భారీగా తవ్వుతున్నట్లు మా దృష్టికి రాలేదు. నదిలో డ్రెడ్జింగ్ చేసేందుకు ఎవరికీ అనుమతులు లేవు. ఏటి గట్లపైనా భారీ వాహనాలు నడపకూడదు. క్షేత్రస్థాయి సిబ్బందితో తనిఖీలు చేపట్టి అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాం.
కాశీవిశ్వేశ్వరరావు, రివర్ కన్జర్వేటర్, ఈఈ, హెడ్ వర్క్స్, ధవళేశ్వరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు