ఆశల దీవి...అనుమతి ఎప్పుడో మరి!
గోదావరి వరదలకు సముద్రంలోకి కొట్టుకొచ్చే ఇసుకతో సహజ సిద్ధంగా సముద్రం మధ్యలో 200 ఏళ్ల క్రితం ఏర్పడిన భూభాగం హోప్ ఐలాండ్. కాకినాడ పోర్టుకు 13 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో 2,500 ఎకరాల్లో విస్తరించిందీ దీవి
మూడున్నరేళ్లుగా నిలిచిన హోప్ ఐలాండ్ సందర్శన
ఈనాడు, కాకినాడ
ఐలాండ్ విహంగ వీక్షణం
సహజ రక్షణ కవచం
గోదావరి వరదలకు సముద్రంలోకి కొట్టుకొచ్చే ఇసుకతో సహజ సిద్ధంగా సముద్రం మధ్యలో 200 ఏళ్ల క్రితం ఏర్పడిన భూభాగం హోప్ ఐలాండ్. కాకినాడ పోర్టుకు 13 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో 2,500 ఎకరాల్లో విస్తరించిందీ దీవి. ఈ ప్రాంతంపై వందల రకాల పక్షి జాతులు, విభిన్న జీవరాశులు ఆధారపడి ఉన్నాయి. కాకినాడ నగరాన్ని విపత్తుల నుంచి కాపాడే సహజ రక్షణ కవచమిది.
గతమంతా ఘనం
హోప్ ఐలాండ్లో పురాతన లైట్ హౌస్ ఉంది. ఇసుక తిన్నెలు.. సాగర జలాల్లో రాకపోకలు సాగించే పెద్ద్ద నౌకలు.. సుందర ప్రకృతి దృశ్యాలు ఇక్కడి ప్రత్యేకత. తాళ్లరేవు మండలంలోని కోరింగ అభయారణ్యంలో అంతర్భాగం ఈ ప్రాంతం.
ఇప్పుడేమయ్యింది..?
ఈ దీవిలో పడవ ప్రయాణం నిలిచిపోయి మూడున్నరేళ్లు దాటింది. కచ్చులూరు వద్ద గోదావరిలో 2019లో పెను ప్రమాదం తర్వాత హోప్ ఐలాండ్ పర్యటన స్తంభించింది. పాపికొండలు, గోదావరి, కోరింగ, దిండి పర్యాటక ప్రాంతాల్లో బోటు షికార్లు పునరుద్ధరించినా.. హోప్ ఐలాండ్కు మాత్రం నేటికీ మోక్షం దక్కలేదు.
మనసును హత్తుకునే చల్లని గాలులు.. చుట్టూ నీలి మేఘాలు.. అబ్బురపరిచే సాగర సోయగాలు.. పక్షుల కిలకిలారావాలతో మదిని దోచే సుందర ద్వీపం హోప్ ఐలాండ్. ఈ దీవి సందర్శనకు దేశ, విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పర్యవేక్షణలో కాకినాడ పోర్టు నుంచి మోటరైజ్డ్ బోటు ద్వారా పర్యాటకులు హోప్ ఐలాండ్ పర్యటనకు వెళ్లేవారు. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత హోప్ ఐలాండ్ యాత్ర నిలిచిపోయింది. ఇక్కడి బోటును రాజమహేంద్రవరంలోని పద్మావతి ఘాట్లో గోదావరి షికారుకు ఏడాదిన్నరగా తిప్పుతున్నారు. ఇన్లాండ్ వెసల్ నిబంధనలకు లోబడి హోప్ ఐలాండ్ పడవ ప్రయాణానికి అనువైన బోటుకు నిధులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన బుట్టదాఖలయ్యింది.
పట్టాలెక్కని ప్రతిపాదనలు
కోరింగ అభయారణ్యాన్ని 1998లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించడంతో వైవిధ్య జీవరాశులున్న ఈ ప్రాంతంలో అటవీ సంరక్షణ కార్యక్రమాలు మినహా మరేవీ అనుమతించకూడదన్న నిబంధన తెరమీదకు వచ్చింది. దీంతో కోరింగలో అంతర్భాగమైన హోప్ ఐలాండ్లో శాశ్వత పర్యాటక అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వాలు పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించినా ప్రగతి సాధ్యపడలేదు. అటవీశాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం(సీబీఈటీ) ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనకూ మోక్షం దక్కడం లేదు. సారా తయారీ, అనధికారిక వ్యవహారాలకు అభయారణ్యం వేదిక అవుతుండడం విమర్శలకు తావిస్తోంది.
పరపతి ఉంటే సై..
అధికారికంగా హోప్ ఐలాండ్ సందర్శనను 45 నెలలుగా నిలిపేశారు. పర్యాటక బోటు ప్రమాణాలకు అనుగుణంగా లేదని పోర్టు యంత్రాంగం తేల్చి ఆంక్షలు తెరమీదకు తెచ్చినా.. ప్రభుత్వం అనువైన బోటుకు నిధులు సమకూర్చలేదు. దీంతో పర్యాటక శాఖ ఆదాయాన్ని కోల్పోయింది. హోప్ ఐలాండ్కు అనధికారిక రాకపోకలు మాత్రం ఆగలేదు. పరపతి, రాజకీయ దన్ను ఉన్న వ్యక్తులు ప్రైవేటు బోట్లలో దర్జాగా ఆ ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. పర్యవేక్షించాల్సిన కీలక శాఖలు చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి.
కొద్ది నెలల్లో పర్యాటక ప్రయాణం
కాకినాడ నుంచి హోప్ ఐలాండ్కు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో బోటు తిప్పడానికి ఓ అడ్వంచర్స్ సంస్థకు అనుమతి దక్కింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరి.. పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని రెండు, మూడు నెలల్లో హోప్ ఐలాండ్ యాత్ర పునరుద్ధరించే అవకాశం ఉంది.
పవన్కుమార్, డివిజనల్ మేనేజర్, ఏపీటీడీసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
[ 20-04-2024]
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు.. -
జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: పురందేశ్వరి
[ 20-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిసితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
నేడు కోరుకొండలో వారాహి విజయభేరి సభ
[ 20-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో శనివారం నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. -
పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
[ 20-04-2024]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. -
కొనసాగిన నామినేషన్ల సందడి
[ 20-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. -
వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!
[ 20-04-2024]
వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. -
రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 20-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం
[ 20-04-2024]
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
జగన్ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం
[ 20-04-2024]
ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. -
వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
[ 20-04-2024]
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
[ 20-04-2024]
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఇళ్లకు వెళ్లడం ఎలా?
[ 20-04-2024]
సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. -
సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?