నిబంధనలు పట్టక.. ఆదాయం దక్కక..
పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, పంచాయతీ పరిధుల్లో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి.
పెద్దాపురం పట్టణం
న్యూస్టుడే, పెద్దాపురం: పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, పంచాయతీ పరిధుల్లో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. కుడా, గుడా, పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనల ప్రకారం భవన నిర్మాణదారులు పనులు చేపట్టాలి. నిబంధనలు కాగితాల్లోనే తప్పా ఆచరణలో కనిపించడంలేదు. ఇంటి ముందున్న మురుగుకాల్వ.. రోడ్డు.. స్థలం ఏదైనా ఆక్రమించుకుని అక్రమ కట్టడాలకు తెర లేపుతున్నారు. సొంత స్థలంలో కొంతభాగాన్ని రోడ్డుకు విడిచిపెట్టకుండా ముందుకు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నట్లు అధికారులు గుర్తించినా చర్యలు శూన్యంగా మారుతున్నాయి. రోడ్డుకు ఎంత కావాలో స్థల యజమాని నుంచి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేయించడంతో గతంలో యజమానులు ఆ స్థలాన్ని విడిచిపెట్టి నిర్మాణాలు చేపట్టేవారు. స్థల విస్తీర్ణం ప్రకారం వెనుక భాగం, రెండు పక్కలా సెట్ బ్యాక్ విడిచిపెట్టి కట్టడాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే భవన నిర్మాణదారులు పాటించడంలేదు. పల్లెలు, పట్టణాలు, నగర ప్రాంతాల్లోనూ ఇదే కొనసాగుతోంది. అలాంటి నిర్మాణాలను వార్డు, గ్రామ సచివాలయ సాంకేతిక సిబ్బంది గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళితే వారు భవన యజమానులకు నోటీసులు జారీచేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని పురపాలక సంఘాలు, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో ఇప్పటికే అధికారులు పలువురికి నోటీసులు అందించారు. వీటిపై స్పందించి భవన నిర్మాణదారులు క్రమబద్ధీకరణకు ముందుకు వస్తే అపరాధ రుసుం వసూలుచేసి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.
ఆదాయాన్ని కోల్పోతున్నాయి..
నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన యజమానులకు నోటీసులు జారీచేస్తున్నా ఆయా భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో జారీచేస్తే పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. ఈ విషయమై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించడంలేదు. ఆస్తి పన్ను పెంచడం, చెత్తపై పన్ను విధించడం, ట్రేడ్ లైసెస్సుల రుసుం వసూలుపై దృష్టి సారిస్తున్నారే తప్ప రూ.కోట్లు ఆదాయం వచ్చే మార్గాలపై శ్రద్ధ చూపడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.
నోటీసులు జారీచేశాం..
నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టిన యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీచేశాం. కొందరిని ప్రాసిక్యూషన్ చేయడానికి కోర్టులో కేసులు వేశాం. పట్టణ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలి. వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వం భవనాల క్రమబద్ధీకరణకు జీవో జారీచేస్తే అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతాం. తద్వారా పురపాలక సంఘాల ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది.
జె.సురేంద్ర, రామారావు, రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్లు పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే
[ 29-03-2024]
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు