దివ్యాంగ బాలల నమోదుకు ప్రశస్త్
ప్రత్యేక అవసరాలుగల (దివ్యాంగ) పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా.. వారికి పూర్తిస్థాయిలో సాయం అందడం లేదు. కారణం..
న్యూస్టుడే, కపిలేశ్వరపురం, పామర్రు: ప్రత్యేక అవసరాలుగల (దివ్యాంగ) పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా.. వారికి పూర్తిస్థాయిలో సాయం అందడం లేదు. కారణం.. వారికి సంబంధించిన సమగ్ర వివరాలు లేకపోవడమే. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించి.. వివరాలు అన్లైన్లో నమెదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ‘ప్రశస్త్’ పేరిట ప్రత్యేక యాప్ రూపొందించారు. దీనిని భవిత కేంద్రాల నిర్వాహకులతోపాటు ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం పిల్లల అందరి వివరాలు రాబట్టి వారిలో దివ్యాంగులను గుర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఇలా ఎంపిక చేసిన వారందరికీ ప్రభుత్వ విద్యతోపాటు వైకల్యం ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు చేపడతారు.
గుర్తింపు ఇలా..
1995 దివ్యాంగుల చట్టం ప్రకారం ఏడు రకాల ప్రత్యేక అవసరాలు చిన్నారుల గుర్తింపు జరిగేది. 2016 దివ్యాంగుల సవరణ చట్టం ప్రకారం 21 రకాల గుర్తింపునకు ఈ ప్రత్యేక యాప్ దోహద పడుతుంది. ప్రతి చిన్న వైకల్యాన్ని గుర్తించడానికి వీలుగా ఇందులో 63 పశ్నలు పొందుపర్చారు. యాప్ డౌన్లోడ్ చేసుకునే ఉపాధ్యాయులంతా ఈ ప్రశ్నల ద్వారా 21 రకాల వైకల్యాలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ రూపొందించిన ఈ కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్రంలో సమగ్ర శిక్ష తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధ్యాయులంతా తమ బడుల్లోని విద్యార్థుల ప్రవర్తన తదితరాల ద్వారా దివ్యాంగులను గుర్తిస్తారు. తరువాత ప్రత్యేక బోధకులు వీరిలోని భిన్న ప్రవర్తనలను కనుగొనేలా చర్యలు తీసుకుంటారు. ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేటప్పుడు పిల్లల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
భవిత కేంద్రంలో శిక్షణ పొందుతున్న దివ్యాంగ బాలలు (పాత చిత్రం)
అర్హులకు ప్రయోజనం చేకూర్చేందుకు..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 64 మండలాలు.. వీటిలో ఒక్కొక్కటి చొప్పున భవిత కేంద్రాలున్నాయి. 121 మంది ఐఈఆర్టీలున్నారు. 1,573 మంది దివ్యాంగ విద్యార్థులు భవిత కేంద్రాలకు హాజరై స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ వంటి సేవలు పొందుతున్నారు. ఇంకా నమోదుకాని దివ్యాంగులు గ్రామాల్లో ఎంతో మంది ఉంటున్నారు. వీరందరికీ హోమ్ బేస్డ్ విద్య అంతంత మాత్రంగానే అందుతోంది. పథకాల ద్వారా లబ్ధి చేకూరడం లేదు. వీరికి కూడా ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ యాప్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పాఠశాలల్లో 92 వేల మంది ప్రత్యేక అవసరాల పిల్లలు మాత్రమే నమోదయ్యారు. వాస్తవానికి వీరి సంఖ్య మూడు లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఇప్పుడు మొత్తం వీరందరినీ గుర్తించడం లక్ష్యంగా ప్రత్యేక సర్వేకు కేంద్రం కార్యచరణ సిద్ధం చేసింది.
ఎటువంటి లక్షణాలను గుర్తిస్తారంటే..
లోకోమోటార్ వైకల్యం, లెప్రసీ నయమైన వ్యక్తులు, మస్తిష్క పక్షవాతం, మరుగుజ్జుతనం, కండరాల బలహీనత, యాసిడ్ దాడి బాధితురాలు, దృష్టిలోపం, వినికిడి లోపం, మేధో వైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, నిర్దిష్ట అభ్యసన వైకల్యాలు, మానసిక ప్రవర్తన, దీర్ఘకాలిక నరాల పరిస్థితి, బ్లడ్ డిజార్టర్, హిమోఫిలియా, తలసేమియా, సికిల్సెల్ వ్యాధి, బహుళ వైకల్యాలు తదితరాలు కూడా నమోదు చేస్తారు.
ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..
- ఎంవీవీ సత్యనారాయణ, సహిత విద్య సమన్వయకర్త, డా. బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా
జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 600 మంది ఉపాధ్యాయులు ప్రశస్త్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయంలో మిగిలినవారు ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలి. ప్రతి దివ్యాంగుడిని విధిగా గుర్తించేలా అందరూ సమన్వయంతో కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?